AP:Covid-19 Media bulletin: @ Date: 29.12.20
రాష్ట్రంలో కొత్తగా 326 కరోనా కేసులు నమోదు కాగా.. ఇద్దరు మరణించారు. మొత్తం వైరస్ బాధితుల సంఖ్య 8,81,599కు చేరింది. ప్రస్తుతం 3,383 మంది చికిత్స పొందుతున్నట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది.
రాష్ట్రంలో క్రమంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 326 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనా మహమ్మారికి బలయ్యారు. రాష్ట్రంలో మొత్తం వైరస్ బాధితుల సంఖ్య 8,81,599కు చేరింది. ఇప్పటివరకు 7,100 మంది మహమ్మారికి బలయ్యారు. కొత్తగా 364 మంది కోలుకోగా.. ప్రస్తుతం 3,383 మంది చికిత్స పొందుతున్నారు. 24 గంటల వ్యవధిలో 50,794 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్యశాఖ పేర్కొంది.
Thanks for reading AP:Covid-19 Media bulletin: @ Date: 29.12.20
No comments:
Post a Comment