AP:Covid-19 Media bulletin: @ Date: 26.01.21
రాష్ట్రంలో కొత్తగా 172 కరోనా కేసులు, ఒక మరణం నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 39 మందికి కొవిడ్ పాజిటివ్గా తెలింది.
గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 172 మందికి కరోనా సోకినట్టుగా వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకూ రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 8 లక్షల 87 వేల238కు చేరింది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,357గా వైద్యాధికారులు తెలిపారు.గడిచిన 24 గంటల్లో కొవిడ్తో కడపలో ఒకరు మరణించినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 7,150గా ఉంది. గత 24 గంటల వ్యవధిలో 203 మంది.. వైరస్ బారినుంచి కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 8 లక్షల 78 వేల 731కి చేరింది.కృష్ణా జిల్లాలో 39, విశాఖపట్నంలో 34, గుంటూరులో 22, చిత్తూరులో 11, కడపలో 15, తూర్పుగోదావరిలో 21, శ్రీకాకుళం 10, అనంతపురంలో 7, పశ్చిమగోదావరిలో 5, ప్రకాశంలో 4, కర్నూలులో 1, నెల్లూరులో 3 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే విజయనగరం జిల్లాలో ఒక కేసులు కూడా నమోదు కాలేదని అధికారులు తెలిపారు.
Thanks for reading AP:Covid-19 Media bulletin: @ Date: 26.01.21
No comments:
Post a Comment