AP:Covid-19 Media bulletin: @ Date: 22.02.21
అమరావతి: ఏపీలో కొత్తగా 41 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో 18,257 నమూనాలను పరీక్షించగా తాజా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 8,89,339కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో కరోనాతో ఎటువంటి మరణం సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు కొవిడ్తో మరణించిన వారి సంఖ్య 7,167కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 71 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 590 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,37,46,985 పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం బులెటిన్లో పేర్కొంది.
జిల్లాల వారీగా కేసుల వివరాలను పరిశీలిస్తే..
Thanks for reading AP:Covid-19 Media bulletin: @ Date: 22.02.21
No comments:
Post a Comment