Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, June 23, 2019

About Sakunthala Devi garu


About Sakunthala Devi garu

శకుంతలా దేవి
(నవంబరు 4, 1929 –ఏప్రిల్ 21, 2013 ) ప్రపంచ ప్రసిద్ధ గణిత, ఖగోళ మరియు జ్యోతిష శాస్త్రవేత్త. ఈమెను అందరూ మానవ గణన యంత్రము అని పిలుస్తారు. ఈమె ప్రపంచవ్యాప్తంగా అనేక గణితావధానములు నిర్వహించి గణన యంత్రము కంటే వేగంగా పలు సమస్యలను పరిష్కరించింది. పలు పుస్తకాలను కూడా రచించింది. ప్రపంచంలో అతి వేగంగా గణనలు చేయుటలో గిన్నిస్ వరల్డ్ రికార్డును స్వంతం చేసుకున్నది.
About Sakunthala Devi garu

జననం
శకుంతలా దేవి బెంగళూరు నగరంలో కన్నడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి ఆలయ పూజారి అగుటకు వ్యతిరేకించి ఒక సర్కస్ కంపెనీలో చేరి తాడుతో చేసే విన్యాసములు చేయుటకు నియమింపబడ్డాడు
శకుంతలా దేవి ఒక భారతీయ రచయిత మరియు గణిత శాస్త్రజ్ఞుడు ప్రముఖంగా "మానవ కంప్యూటర్" గా పిలవబడ్డాడు. ఆమె తలపై గణిత గణన గణనలను తయారుచేయడంతో పాటు ఆమె ఫలితాలను అప్రయత్నంగా మాట్లాడింది! సర్కస్ కళాకారుని కుమార్తెగా దక్షిణ భారతదేశంలో పేద కుటుంబంలో జన్మించిన ఆమె చిన్న వయస్సులోనే తన నైపుణ్యాలను ప్రదర్శించడం ప్రారంభించింది. ఆమె తండ్రి చైల్డ్ ప్రాడిజీగా ఆమెను గుర్తించి రోడ్డు ప్రదర్శనలలో ఆమెను లెక్కలోకి తీసుకున్న తన సామర్థ్యాన్ని ప్రదర్శించింది. యువకుడి యొక్క గణితశాస్త్ర పరాక్రమం గురించి నిజంగా అద్భుతమైనది ఏమిటంటే, ఆమె తన కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి కారణంగా ఏ విధమైన సాంప్రదాయిక విద్యను పొందలేక పోయింది, అయినప్పటికీ ఆమె సమయములో ఉన్న అత్యంత తెలివైన గణితాల్లో ఒకటిగా ఉద్భవించింది. ఏ సాంకేతిక పరికరాల సహాయం లేకుండా చాలా సంక్లిష్టమైన గణిత గణనలను నిర్వహించే ఆమె అసాధారణ సామర్థ్యాన్ని ఆమెకు చాలా ఖ్యాతి గడించింది మరియు ఆమె చివరికి అంతర్జాతీయ దృగ్విషయంగా మారింది. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బర్కిలీలో మనస్తత్వశాస్త్రం యొక్క ప్రొఫెసర్ అయిన ఆర్థూర్ జెన్సెన్ తన సామర్ధ్యాలను పరీక్షించి, అధ్యయనం చేశాడు మరియు అకాడెమిక్ జర్నల్ 'ఇంటెలిజన్స్'లో తన పరిశోధనలను ప్రచురించాడు. 1982 లో ది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎడిషన్లో ఆమె అసాధారణ సామర్ధ్యాలు కూడా చోటు సంపాదించాయి. అంతేకాకుండా, పిల్లల పుస్తకాలకు బాగా తెలిసిన రచయిత, అదేవిధంగా గణితం, పజిల్స్ మరియు జ్యోతిషశాస్త్రంపై రచనలు చేశారు.
1977లో అమెరికాలో ఓ కంప్యూటర్తో శకుంతలా దేవికి పోటీ పెట్టారు. 188132517 అనే సంఖ్యకు మూడో వర్గం కనుక్కోవడంలో ఈ పోటీ పెట్టగా, ఆమె కంప్యూటర్ను ఓడించేశారు. ఇక 1980 జూన్ నెలలో 13 అంకెలున్న రెండు సంఖ్యలు తీసుకున్నారు. 76,86,36,97,74,870 అనే సంఖ్యతో 24,65,09,97,45,779 అనే సంఖ్యను హెచ్చవేస్తే ఎంత వస్తుందని లండన్ ఇంపీరియల్ కాలేజిలోని కంప్యూటర్ విభాగంలోని ఓ సూపర్ కంప్యూటర్ శకుంతలా దేవిని ప్రశ్నించింది. దానికి ఆమె కేవలం 28 సెకన్లలో సమాధానం ఇచ్చారు. ఆ సమాధానం.. 18,947,668,177,995,426,462,773,730. ఆ దెబ్బకు గిన్నిస్ రికార్డు ఆమె పాదాక్రాంతమైంది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన మానసిక శాస్త్ర ప్రొఫెసర్ ఆర్థర్ జెన్సెన్ స్వయంగా శకుంతలా దేవి గణిత ప్రతిభను పరిశీలించి అవాక్కయ్యారు.
ఆరేళ్ల వయసులో తొలిసారి శకుంతలా దేవి మైసూరు విశ్వవిద్యాలయంలో తన గణిత ప్రతిభను బహిరంగంగా ప్రదర్శించారు.
ఎనిమిదేళ్ల వయసులో అన్నామలై విశ్వవిద్యాలయంలో ఆమె ప్రదర్శనతో శకుంతలాదేవిని బాలమేధావిగా గుర్తించారు.గత శతాబ్ద కాలంలో ఏ తేదీ చెప్పినా అది ఏ వారం అవుతుందో చిటికెలో ఆమె చెప్పేవారు.
1977లో 201 అంకెలున్న సంఖ్యకు 23వ వర్గం ఎంతో కేవలం 50 సెకండ్లలో చెప్పేశారు.
బెంగళూరు: హ్యూమన్ కంప్యూటర్‌గా పేరొందిన శకుంతలా దేవి కన్నుమూశారు. కొన్నాళ్లుగా శ్వాసకోశ సంబంధ సమస్యలతో ఇబ్బంది పడుతున్న శకుంతలా దేవి చికిత్స కోసం ఇటీవల ఓ ఆసుపత్రిలో చేరారు. గుండెపోటు రావడంతో ఆదివారం ఉదయం మృతి చెందారు. ఆదివారం ఉదయం 8:15 గంటలకు శకుంతలా దేవి తుదిశ్వాస విడిచారని ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ పబ్లిక్ ట్రస్ట్ ట్రస్టీ డిసి శివదేవ్ తెలిపారు.

శకుంతలాదేవికి ఒక కుమార్తె ఉన్నారు. ఆమె 1929 నవంబర్ 4న సంప్రదాయ కన్నడ బ్రాహ్మణ కుటుంబంలో బెంగళూరులో జన్మించారు. ఆమె తండ్రి సర్కస్‌లో పని చేసేవారు. మూడేళ్ల వయసులోనే పేకలతో ట్రిక్కులు చేయడంలో శకుంతల ప్రతిభను ఆయన గుర్తించారు. ఎంత ప్రతిభ ఉన్నా.. పేదరికం కారణంగా ఆమె చదువుకోలేకపోయారు. తల్లిదండ్రులు ఆమెను ఒకటో తరగతిలో చేర్చినప్పటికీ.. నెలకు రూ.2 ఫీజు కట్టలేక మధ్యలోనే బడి మాన్పించేశారు.
అయితే, ఆమె ప్రతిభ గురించి అన్ని దిక్కులా వ్యాపించింది. ఆరేళ్లప్పుడు యూనివర్సిటీ ఆఫ్ మైసూర్‌లో, ఎనిమిదేళ్ల వయసులో అన్నామలై వర్సిటీలో.. గణితంలో తనకున్న ప్రావీణ్యాన్ని ఆమె బహిరంగంగా ప్రదర్శించారు. 1977లో 201 అంకెలున్న సంఖ్యకు 23వ వర్గాన్ని ఆమె తన మనసులోనే గుణించి 50 సెకన్లలో సమాధానం చెప్పి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు.ఆమె చెప్పిన సమాధానాన్ని ద్రువీకరించుకోవడానికి శాస్త్రజ్ఞులు ఆ అంకెను వేగవంతమైన యూనివాక్ 1108 కంప్యూటర్‌కు ఫీడ్ చేయగా.. ఇదే సమస్యను పరిష్కరించడానికి దానికి ఒక నిమిషంపైగానే సమయం పట్టింది. అలాగే, 1980 జూన్ 18న.. ఇంపీరియల్ కాలేజ్, లండన్ కంప్యూటర్ విభాగం వారు ఆమెకు ఒక పరీక్ష పెట్టారు. కంప్యూటర్ అప్పటికప్పుడు ఇచ్చిన రెండు పదమూడు అంకెల సంఖ్యలను గుణించి ఫలితం చెప్పమన్నారు.ఆ ప్రశ్నకు ఆమె సరిగ్గా 28 సెకన్లలో సమాధానం చెప్పి వారిని ఆశ్చర్యానికి గురిచేశారు. గత శతాబ్దిలో ఏ ఏడాదిలో ఏ నెలలో ఏ తేదీన ఏ వారం వచ్చిందో.. నిద్రలో లేపి అడిగినా ఠక్కున చెప్పే మేధస్సు ఆమె సొంతం. అంతేకాదు, ఆమె రచయిత్రి కూడా. గణితం, జ్యోతిషాలను అంశాలుగా తీసుకుని.. ఫన్ విత్ నంబర్స్, ఆస్ట్రాలజీ ఫర్ యు, పజిల్స్ టు పజిల్ యు, మాథబ్లిట్, ఎవేకెన్ ద జీనియస్ ఇన్ యువర్ చైల్డ్, ఇన్ ద వండర్‌లాండ్ ఆఫ్ నంబర్స్ వంటి పుస్తకాలు రాశారు.

Thanks for reading About Sakunthala Devi garu

No comments:

Post a Comment