ఓపెన్ స్కూల్ ప్రవేశాలు
★ ఓపెన్స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలకు అపరాధంతో ప్రవేశ రుసుము చెల్లింపునకు ఈనెల 16వ తేదీ వరకు గడువు పొడిగింపు.
★ పదో తరగతికి రూ.100లు, ఇంటర్మీడియట్కు రూ.200లు అదనంగా చెల్లించాలి. పదో తరగతిలో ఓసీలకు రూ.1550లు, ఇంటర్కు రూ.1800లు చెల్లించాలి.
★ దరఖాస్తులను ఆన్లైన్ చేసుకున్న తరువాత సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఎంపిక చేసుకున్న స్టడీ సెంటర్లతో లాగిన్ కావాలి.
★ ఐడీ ద్వారా ఫోన్కు వచ్చిన రెఫరెన్స్ నెంబర్ ఆధారంగా అభ్యర్థులు స్వయంగా మీ సేవ, ఏపీ ఆన్లైన్, నెట్బ్యాంకింగ్ ద్వారా రుసుము చెల్లించవచ్చు.
★ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం 74 ప్రకారం 40 శాతం వైకల్యం ఉన్న ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఉత్తీర్ణత మార్కులు తగ్గింపు.
★ అంధులు, వినికిడిలోపం ఉన్నవారికి 35 నుంచి 20 మార్కులకు తగ్గింపు, ఆటిజం, బుద్దిమాంద్యం, మస్తిష్క పక్షవాతం ఉన్నవారికి 35 నుంచి 10 మార్కులకు తగ్గింపు.
★ అభ్యసన వైకల్యం ఉన్నవారికి ఏదైనా ఒక పాఠ్యాంశంలో 20 మార్కులు, మిగిలిన వాటిలో 35 మార్కులు వస్తే ఉత్తీర్ణత సాధించనట్లే
Thanks for reading Open School Admissions
No comments:
Post a Comment