Today is last day for Child Info Update .. Three profiles to correct deficits.
- వేగంగా అమ్మఒడి ఆన్లైన్ సమాచారాన్నీ ధృవీకరించుకుంటారు
- చైల్డ్ ఇన్ఫో అప్డేట్ కు నేడే తుది గడువు
- లోటుపాట్లను సరిదిద్దడానికి మూడు ప్రొఫార్మాలు -
- డిసెంబరు 20 నాటికి తుది జాబితాలు సిద్ధం
విద్యార్ధుల , తల్లులకు లబ్ధి చేకూర్చడానికి అమలుచేస్తున్న ' జగనన్న అమ్మఒడి ' ఆన్లైన్ ప్రక్రియలో జిల్లా విద్యాశాఖాధికారులు వేగం పెంచారు . అర్హుల తుది జాబితాలను వచ్చే నెల 20వ తేదీకి సిద్ధం చేయాలని , ఆ కార్యకలాపాలను ఎలా పూర్తి చేయాలో ప్రభుత్వమే నిర్దేశిస్తూ సమయ పట్టికను కూడా సూచిస్తూ ప్రభుత్వం ఈ నెల 16న తాజా ఉత్తర్వులను జారీ చేసింది . రాష్ట్రంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన అన్ని ప్రభుత్వ పాఠశాలలు , ఎయిడెడ్ , ప్రైవేటు అన్ఎయిడెడ్ పాఠశాలలు , జూనియర్ కళాశాలలు , ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్ని గురుకుల పాఠశాలలు , కళాశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న నిరుపేద కుటుంబాల విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ . 15 వేలు చొప్పున అందజేయనున్నారు .
చైల్డ్ ఇన్ఫో అప్ డేట్ ఇలా . . . .
లబ్ధిదారుల ( విద్యార్థుల తల్లులు ) ఆధార్ నెంబర్లు , బ్యాంకు ఖాతా నెంబర్లు , ఐఎఫ్ఎస్సీ కోడ్ , రేషన్ కార్డుల వివరాలతో కూడిన దరఖాస్తులను ఇప్పటికే స్వీకరించారు . వాటిని ఆన్లైన్లో చైల్ ఇన్ఫోలో అప్లోడ్ చేశారు . వీటిలో లోటుపాట్లుంటే సరిచేసుకుని తాజా డేటాను అప్డేట్ చేయాలి . ఈప్రక్రియను మంగళవారం(బుధవారం) సాయంత్రానికి పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది . ఆ తర్వాత లబ్ధిదారుల వివరాలను apcse పోర్టల్ ద్వారా ప్రకటిస్తారు . ఈ ప్రక్రియను పూర్తిచేసి ఈనెల 21కి ప్రధానోపాధ్యాయులు , ప్రిన్సిపాళ్లకు ' లాగ్ ఇన్ ఐడీ , పాస్ వర్డ్ అందజేస్తారు .
లోపాలను ఇలా సరిదిద్దుతారు
' అమ్మఒడి ' పథకానికి దరఖాస్తు చేసుకున్నవారిలో కొందరికి రేషన్ కార్డులు , ఆధార్ నెంబర్లు , బ్యాంకు ఖాతాల్లో ఏదో ఒకటి లేకపోవడంతో లబ్ది పొందలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి . వీటిని సరిచేయడానికి ప్రభుత్వం మూడు ప్రొఫార్మాలను నిర్దేశించింది . తెల్ల రేషన్ కార్డున్న తల్లుల వివరాలతో మొదటి ప్రొఫార్మా , కార్డు లేని తల్లుల వివరాలతో రెండో ప్రొఫార్మా , ఆధార్ నెంబరు , ఆధార్ ఎన్రోల్మెంటు నెంబరు లేని విద్యార్థుల వివరాలను సేకరించేందుకు మూడో ప్రొఫార్మా ప్రధానోపాధ్యాయుల వద్ద అందుబాటులో ఉంటాయి . వీటి ద్వారా లబ్దిదారుల డేటా ( ప్రీ పాపులేటెడ్ డేటా ) లోని సమాచారాన్ని ప్రధానోపాధ్యాయులు మరోసారి ధ్రువీకరించుకుని లోపాలుంటే సరిదిద్దుకోవాలి . ఆ జాబితాలను గ్రామ / వార్డు సచివాలయాల్లోని విద్య , సంక్షేమ సహాయకులు లాగిన్ కావడానికి ఈ నెల 24న పంపిస్తారు . రెండు , మూడో ప్రొఫార్మాల ద్వారా వచ్చిన సమాచారాన్ని గ్రామ వలంటీర్లకు అందజేస్తారు . వారుసమాచారాన్ని ధ్రువీకరించుకుంటారు . ఈ ప్రక్రియ 25 నుంచి డిసెంబరు ఒకటో తేదీలోపు పూర్తి చేయాల్సి ఉంది . ఈ సమాచారాన్ని డిసెంబర్ ఐదో తేదీకి ' ఏపీసీఎఫ్ఎస్ఎస్ ' లో అప్ డేట్ చేయాలి .
విద్యార్థుల హాజరు నమోదు
లబ్దిదారుల ముసాయిదా జాబితాలను సిద్ధం చేసేటప్పుడు ప్రధానోపాధ్యాయులు . . విద్యార్థులకు పాఠశాల పని దినాల్లో 75 శాతం హాజరు ఉన్నదీ లేనిదీ పరిశీలించి . . ఆ వివరాలను జత చేస్తారు . అభ్యంతరాలను సరి చేసి వచ్చే నెల 23న డీఈవోకు అందిస్తారు . ఆ జాబితాలను 24న కలెక్టర్కు అందజేస్తారు . ఆ తర్వాత ప్రభుత్వ ఆమోదంతో ' అర్హులైన తల్లులందరి ఖాతాల్లో రూ . 15 వేలు చొప్పున నగదు జమవుతుంది . పక్కాగా ఆన్లైన్ ఆన్లైన్ ప్రక్రియను పక్కాగా పూర్తి చేస్తున్నాం . పాఠశాలల తల్లిదండ్రుల కమిటీలు కూడా ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంటుంది . పొరపాట్లు దొర్లకుండా పర్యవేక్షించేందుకు విద్యాశాఖ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం . ఎవరైనా విద్యార్థికి తల్లి లేకపోతే తండ్రి లేదా గుర్తింపు పొందిన సంరక్షకుడి వివరాలు సేకరిస్తారు . మధ్యలో బడి మానేసిన విద్యార్థుల తల్లులకు లబ్ధి చేకూరదు . - చంద్రకళ , డీవైఈవో , విజయవాడ
Thanks for reading Today is last day for Child Info Update .. Three profiles to correct deficits..
No comments:
Post a Comment