Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, December 27, 2019

AP Cabinet Meeting Highlights 27-12-2019



AP  Cabinet Meeting Highlights 27-12-2019

  అమరావతి: ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. శుక్రవారం ఉదయం 11గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం 01:15 గంటలకు ముగిసింది. ఈ సమావేశంలో నవ్యాంధ్ర రాజధానికి సంబంధించి జీఎన్‌ రావు కమిటీ నివేదిక, స్థానిక ఎన్నికలపై ఈ సమావేశంలో నిశితంగా చర్చించినట్లు తెలుస్తోంది. సమావేశంలో భాగంగా రాజధానిపై కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మూడు రాజధానులపై కేబినెట్‌ భేటీలో.. అఖిలపక్ష సమావేశం నిర్వహించిన తర్వాత నిర్ణయం ప్రకటించాలని అనుకున్నట్లు సమాచారo


  రాజధాని అంశంపై చర్చించేందుకు ఏర్పాటైన ఏపీ కేబినెట్ సమావేశం 2గంటల 15 నిమిషాలపాటూ సాగింది. ఇందులో ప్రధానంగా రాజధాని అంశంపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన రిపోర్టును సీఎం జగన్, మంత్రులు చర్చించారు. అమరావతిలో పరిస్థితులు, విశాఖలో పరిపాలనా పరంగా రాజధాని ఏర్పాటు ప్రతిపాదన, రాజధానిలో రైతులకు ఎలా న్యాయం చెయ్యాలి? ఇలాంటి అంశాలన్నింటిపైనా చర్చించారని తెలిసింది. ఐతే... కేబినెట్‌ సమావేశంలో ప్రస్తుతానికి రాజధాని అంశంపై ఏ నిర్ణయమూ తీసుకోలేదని తెలుస్తోంది. ఇప్పుడు బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఇచ్చే పూర్తిస్థాయి నివేదిక కీలకం కానుంది. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ రాజధాని అంశంపై ప్రస్తుతానికి మధ్యంతర నివేదిక ఇచ్చింది. దానిపైనా ఇవాళ్టి కేబినెట్ మీటింగ్‌లో చర్చ జరిగింది. ఆ సంస్థ జనవరి 3న పూర్తి స్థాయి నివేదిక ఇస్తుందని తెలిసింది. ఆ నివేదిక ఇచ్చిన తర్వాతే... రాజధానిపై ఫైనల్ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ లోగా రాజధాని అంశంపై కేబినెట్ సబ్ కమిటీని వెయ్యాలని కేబినెట్ చర్చించినట్లు తెలిసింది.
  బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (BCG) అనేది... రాజధాని అనేది గ్రీన్ ఫీల్డ్ ఏరియాల్లోనే కాక... బ్రౌన్ ఫీల్డ్ ఏరియాల్లో కూడా ఉండొచ్చని చెబుతోంది. బ్రౌన్ ఫీల్డ్ అంటే... ఆల్రెడీ భవనాలు ఉన్న చోటిని ఇలా పిలుస్తారు. BCG పూర్తి స్థాయి నివేదికను బట్టీ... రాజధాని ఎక్కడ ఉండాలన్నది నిర్ణయిస్తారని తెలిసింది. ఒకవేళ BCG ఇచ్చే నివేదిక ఆధారంగా రాజధానిని నిర్మించాలనుకుంటే... అమరావతి లాగా ఏమాత్రం నిర్మాణాలు లేని ప్రదేశం కంటే... ఆల్రెడీ నిర్మాణాలు ఉన్న వైజాగ్ లాంటి ప్రాంతంలోనే రాజధానిని నిర్మించే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఇప్పుడు BCG నివేదిక కీలకం కానుంది.
ప్రస్తుతం అమరావతి రైతులు ఆందోళనలు ఉద్ధృతం చేశారు. వారికి న్యాయం చేసే అంశంపై ప్రభుత్వం ఎలా ముందుకెళ్లాలన్న అంశం కీలకంగా మారింది. అందువల్లే వెంటనే ఈ అంశంపై ప్రభుత్వం ఏ నిర్ణయమూ తీసుకోలేకపోయిందని తెలిసింది. BCG నివేదిక వచ్చేటప్పటికి మరో వారం టైమ్ ఉంటుంది కాబట్టి... ఈ లోగా ప్రభుత్వం అన్ని కోణాల్లో ఆలోచించే ఛాన్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. జనవరి 3 తర్వాత ప్రత్యేక అసెంబ్లీ సమావేశం కూడా ఉంటుందని తెలిసింది
చర్చకొచ్చిన అంశాలివీ..!
  కాగా.. వీటితో పాటు రాజధాని రైతులకు ఇచ్చే రిటర్నబుల్‌ ప్లాట్స్‌ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. గతంలో అమరావతిలో ఆలిండియా సర్వీస్‌ అధికారులు భూములు కొనుగోలుకు చెల్లించిన మొత్తాన్ని తిరిగివారికి చెల్లించేందుకు నిర్ణయం తీసుకుందని సమాచారం. కర్నూలులో వెటర్నరీ కాలేజీ ఏర్పాటుపై కూడా కేబినెట్‌లో చర్చించారని తెలుస్తోంది.

సీఎంకు నివేదిక అందజేత..

  గత ప్రభుత్వం హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు, నిర్మాణాలపై మంత్రివర్గ ఉపసంఘం నివేదికను సీఎం వైఎస్ జగన్‌కు అందజేసింది. దాదాపు 4 నెలల పాటు వేర్వేరు సందర్భాల్లో సమావేశమై రాజధాని సహా అన్ని ప్రభుత్వ విభాగాలు, ప్రాజెక్టుల్లో జరిగిన అవకతవకలపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేసింది. రాజధాని ప్రాంతంలోని నిర్మాణాలు, ల్యాండ్ పూలింగ్, రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు పైనా ఈ కమిటీ అధ్యయనం చేసింది. కేబినెట్ సమావేశంలో ఉప సంఘం నివేదిక అంశాలపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో వివిధ ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందనే ఆరోపణలపై జూన్ 30 న కెబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

Thanks for reading AP Cabinet Meeting Highlights 27-12-2019

No comments:

Post a Comment