MEO సంతకం ఫోర్జరీ చేసిన ఇద్దరు టీచర్ల సస్పెన్షన్
⬛ ఎంఈవో సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. విద్యాశాఖాధికారుల కథనం మేరకు చిత్తూరు జిల్లా...పాకాల మండలం వల్లివేడు ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న రవికుమార్, గాదంకి ప్రాథమిక పాఠశాలలో పని చేసే గురుప్రసాద్ ఓ చిట్ఫండ్ కంపెనీలో వేసిన చిట్స్ తీసుకున్నారు.
⬛ సదరు చిట్ఫండ్ సంస్థ నిర్వాహకులు ఎంఈవో నుంచి శాలరీ సర్టిఫికెట్ ఇవ్వాలని ఆ ఉపాధ్యాయులను కోరారు. దీంతో వారు ఎంఈవో సీల్ (నకిలీ) తయారు చేసుకోవడంతో పాటు, ఎంఈవో బాబ్జీ సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి సమర్పించారు.
⬛ అనుమానం వచ్చి చిట్ ఫండ్ సంస్థ నిర్వాహకులు ఎంఈవోను వివరణ కోరగా అది తన సంతకం కాదని ఆయన తేల్చిచెప్పారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఉపాధ్యాయులపై ఎంఈవో గత నెల 13న పాకాల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
⬛ దీనిపై పోలీసులు చేపట్టిన విచారణలో ఉపాధ్యాయులు ఎంఈవో సీలు, సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు తేలింది. స్థానిక పోలీసులు దీనికి సంబంధించిన నివేదికను గురువారం డీఈవో కార్యాలయానికి పంపండంతో సంతకం ఫోర్జరీకి పాల్పడ్డ ఆ ఇద్దరు ఉపాధ్యాయులను అధికారులు సస్పెండ్ చేశారు
Thanks for reading Two teachers suspended by MEO signature forgery
No comments:
Post a Comment