రేషన్ కార్డులో మార్పులు చేర్పులు కి అవకాశం కల్పించిన ప్రభుత్వం
రేషన్ కార్డుల్లో పేర్ల నమోదు, తొలగింపులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. గత ఏడాదిన్నర కాలగా జిల్లా వ్యాప్తంగా వేలాది మంది ఈ మార్పులు, చేర్పుల కోసం అవస్థలు పడుతున్నారు. ఈ అవకాశం కల్పించకపోవడంతో అనేక మంది అర్హులు ప్రభుత్వ పథకాలకు నోచుకోలేకున్నారు. మండలాల్లోని తహసీల్దారు లాగిన్లల్లోనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 2018 సెప్టెంబరు 13 తేదీ నుంచి ఈనెల 10వ తేదీ వరకు మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నవారి అర్జీలను త్వరితగతిన పరిష్కరించేందుకు అనుమతి లభించడంతో జేసీ తగు చర్యలు మొదలు పెట్టారు. ఇందుకోసం అర్జీదారులు సమర్పించిన అర్జీతోపాటు విచారణ జరిపిన సిఫార్సు లేఖ పంపాల్సిందిగా తహసీల్దార్లకు జేసీ ఆదేశించారు.
రేషన్కార్డుల్లో పేరు తొలగింపునకు ఆధార్కార్డు, మీసేవ చలాన, ఒక వేళ ఆ వ్యక్తి మరణించి ఉంటే.. మరణ ధ్రువీకరణ పత్రం, కార్డులో నుంచి తొలగించాల్సిన వ్యక్తికి వివాహం అయ్యి ఉంటే.. వివాహం జరిగిన గ్రామం నుంచి వెళ్లిపోయినట్లు నివేదిక ఉండాలని జేసీ ఇటీవల తహసీల్దార్లకు పంపిన సంబంధిత ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో మీసేవ పోర్టల్లో పెండింగ్లో ఉన్న తొలగింపు, చేర్పులకు సంబంధించిన అర్జీలను తహసీల్దార్లు తమ నివేదికలో ఈనెల 18వ తేదీలోగా పంపాలని ఈ సందర్భంగా జేసీ ఆదేశించారు. రాని అర్జీలను తిరస్కరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Thanks for reading Changes in the ration card that the government has given the opportunity.
No comments:
Post a Comment