Teleconference ended with municipal minister asked the teachers' unions to take part in the corona survey
పురపాలక శాఖామాత్యులు సంఘాలతో టెలి కాన్ఫరెన్స్ ముగిసింది. కరోనాఇంటింటి సర్వే లో పాల్గొనాల్సిందిగా మంత్రిగారు ఉపాధ్యాయ సంఘాలను కోరారు
ఉపాధ్యాయుల సేవలు పూర్తిగా వారికి ఐచ్ఛికం అయితేనే తీసుకోవాలని
ఉపాధ్యాయ సేవలు స్వచ్ఛందం.నిర్భందం కారాదు
మహిళా ఉపాధ్యాయినిలందరిని పూర్తిగా మినహాయించాలి
అనివార్య పరిస్థితులలో ఉపాధ్యాయుల సేవలు అవసరమైతే ఈ క్రింది వారికి మినహాయింపులు కోరారు
50 సంవత్సరాల వయస్సు నిండిన వారిని
గుండె జబ్బు, రక్తపోటు, ఆస్తమా, మధుమేహం,మెదడు,నాడీ సంబంధ,మానసిక మొదలైన దీర్ఘకాలిక వ్యాధులు
గర్భిణీ స్త్రీలను పిల్లలకు పాలిచ్చే తల్లులు
దివ్యాంగులు
అన్ని సంఘాలతో మాట్లాడిన తర్వాత మంత్రిగారు తుది నిర్ణయం గా 50 సంవత్సరాల వయస్సు దాటిన వారికి మినహాయింపు ఇస్తామని, మిగిలిన వారిలో దీర్ఘ వ్యాధులు ఉన్నవారికి, గర్భిణులకు ,పిల్లల తల్లులకు,దివ్యాంగులకు మినహాయింపు ఇస్తామని ప్రకటించారు .సెలవుల సందర్భంగా ఇతర పట్టణాలకు గ్రామాలకు వెళ్ళినవారు తాము ప్రస్తుతం ఉన్న పట్టణంలో సర్వేలో పాల్గొనటానికి అవకాశం ఇచ్చారు. మాస్కులు, సానిటైజర్లు మొదలైన రక్షణ సామాగ్రి మరియు పాసులు ఇస్తామని తెలియజేశారు
Thanks for reading Teleconference ended with municipal minister asked the teachers' unions to take part in the corona survey
No comments:
Post a Comment