Distribution of pensions with signatures in April, Exemption from biometric
ఏప్రిల్ లో సంతకాలు తీసుకొని పింఛన్ల పంపిణీ
బయోమెట్రిక్ నుంచి మినహాయింపు
కరోనా నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశం
కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపధ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏప్రిల్ లో పింఛనుదారులకు బయోమెట్రిక్ నుంచి మిన
హాయింపు ఇవ్వాలని నిర్ణయించింది. గ్రామ వార్డు వాలంటీర్లు లబ్దిదారుల ఇంటికెళ్లి బయో
మెట్రిక్ లో వేలిముద్రలు తీసుకొని పింఛను
నగదు అందజేసేవారు. రాష్ట్రంలో ఇప్పటికే
రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావ
డంతో పాటు అనుమానితులు సంఖ్య పెరిగి
పోతుండటంతో ముందస్తు జాగ్రత్తలు తీసు
కుంటున్నారు. బయోమెట్రిక్లో లభబ్ధిదారుల
వేలిముద్రలు తీసుకోవడం ద్వారా వైరస్ ఒకరి
నుంచి మరొకరికి సులభంగా వ్యాపించే ప్రమా
దముందని వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు హెచ్చరించారు.
వారి ఆదేశానుసారం ఏప్రిల్ లో లబ్దిదారు
లకు బయోమెట్రిక్ నుంచి మినహాయించా
లని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్టు
డైరెక్టర్లు గురువారం ఉత్తర్వులు జారీ
చేశారు. వచ్చే నెల 1న వాలంటీర్లు పింఛను
పంపిణీ చేసేటప్పుడు సంతకాలు తీసుకోవా
లని సూచించారు. జియో కోఆర్డినేట్స్ ఆధా
రంగా చరవాణిలో లబ్దిదారు ఫొటో తీసుకో
వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు
Thanks for reading Distribution of pensions with signatures in April, Exemption from biometric
No comments:
Post a Comment