Exams canceled for classes 6 to 9
6 నుంచి 9 తరగతుల వరకూ పరీక్షలు రద్దు: మంత్రి ఆదిమూలపు సురేష్
సురేష్జగనన్న గోరుముద్దలు పథకం (మధ్యాహ్న భోజనం) కింద విద్యార్థులకు ఇంటి వద్దకే పౌష్టికాహారం అందించాలని సీఎం ఆదేశించారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. కరోనా ప్రభావంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విద్యార్థులకు డ్రై రేషన్ 10 రోజులకు అవసరమైన మొత్తం ఇస్తున్నామన్నారు. ఏప్రిల్ 14 వరకూ డ్రై రేషన్ అందిస్తామన్నారు. డ్రై రేషన్ను గ్రామ వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటికే అందిస్తామన్నారు. వచ్చేనెల 14 తర్వాత పాఠశాలలు తెరిచే అవకాశం ఉంటుందన్నారు. ఇప్పటికే 1 నుంచి 5వ తరగతులకు వార్షిక పరీక్షలు నిర్వహించామన్న ఆయన.. ఈ నెల 31 జరిగే సమీక్ష అనంతరం పది పరీక్షల తేదీలు ప్రకటిస్తామన్నారు. హాజరు ఆధారంగా 6-9 తరగతి వరకు పరీక్షలు లేకుండా ప్రమోట్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
Thanks for reading Exams canceled for classes 6 to 9.........6 నుంచి 9 తరగతుల వరకూ పరీక్షలు రద్దు: మంత్రి ఆదిమూలపు సురేష్
No comments:
Post a Comment