Headlines of Chief Minister Jagan's Press Meet
ముఖ్యమంత్రి జగన్ ప్రెస్ మీట్ లోని ముఖ్య అంశాలు.
★ దేశంలో భయానక వాతావరణం ఉంది. మిగతా రాష్ట్రాల ఏ.పీ కంటే మెరుగ్గా ఉంది.
★ ఏ. పీలో మార్చి 31 వరకు లాక్ డౌన్.
★ ప్రజలు అవసరమైతేనే బయటికి రావాలి.
★ అంతర్రాష్ట్ర సరిహద్దుల మూసేస్తున్నాం.
★ అత్యవసర సర్వీసులకు మాత్రమే మినహాయింపు.
★ ఆర్టీసీ బస్సులు, ఆటోలు, టాక్సీలు బంద్.
★ నిత్యావసర షాపులు తప్ప మిగతా దుకాణాలు బంద్.
★ పదో తరగతి, ఇతర పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని నిర్ణయించాం. అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాకే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం.
★ ప్రతి కుటుంబానికి రూ. 1000 ఇస్తాం.
★ ఏపీలో ప్రజా రవాణా వ్యవస్థను పూర్తిగా నిలిపివేస్తున్నామని వెల్లడి.
★ ఉద్యోగులకు విడతల వారీగా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం.
★ విదేశాల నుంచి వచ్చేవారంతా 14రోజుల పాటు ఇళ్ల నుంచి బయటకు రావద్దు.
★ అత్యవసరమైతే తప్పక బయటకు రావద్దు. అందరూ ఇళ్లలోనే ఉండండి. ప్రజలకు ఇదే నా విజ్ఞప్తి.
★ కూరగాయలు, పాలు, మెడిసన్ కోసమే బయటకు రండి.
★ నిత్యావసర దుకాణాలు తప్ప అన్నింటినీ బంద్ చేస్తునన్నాం.
అన్ని రాష్ట్రాలతో కలిసి ముందుకెళ్తేనే కరోనాను అరికట్టగలమని ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి అన్నారు.
★ ‘రేషన్కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.వెయ్యి అందిస్తాం. ఈనెల 29నే రేషన్ సరకులు అందిస్తాం. రేషన్కార్డు ఉన్నవారికి కిలో పప్పు ఉచితంగా ఇస్తాం.
★ వ్యవసాయ కూలీలు మాత్రం పొలం పనులకు వెళ్లినప్పుడు రెండు మీటర్ల దూరం ఉండేట్లు చూసుకోవాలన్నారు.
★ గోడౌన్లు, ఫ్యాక్టరీలు అతి తక్కువ సిబ్బందితో నడపాలని సూచించారు.
★ ప్రతి కుటుంబానికి ఏప్రిల్ 4న రూ.1000 అందిస్తామని తెలిపారు.
★ నిత్యావసరాల ధరలు పెరగకుండా కలెక్టర్లు చూడాలి. నిర్ణయించిన ధర కంటే ఎక్కువకు అమ్మితే పోలీసు కేసులు.
★ నిత్యావసరాలు విక్రయించే దుకాణాలు అందుబాటులో ఉంటాయి’ అని అన్నారు
Thanks for reading Headlines of Chief Minister Jagan's Press Meet
No comments:
Post a Comment