Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, March 19, 2020

Janata curfew across the country on Sunday: Modi New Guidelines for the Corona


Janata curfew across the country on Sunday: Modi
New Guidelines for the Corona

♦ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ ఎవరూ బయటికి రావొద్దు : ప్రధాని మోదీ


*🔸దేశంలో ప్రస్తుతం సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని ప్రధాని మోదీ అన్నారు. కరోనాపై మాట్లాడిన మోదీ.. దేశ ప్రజలకు పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

*🔹నేను ఎప్పుడు అడిగిన దేశ ప్రజలు కాదనకుండా చేశారు. నేను ఈసారి కూడా మిమ్మల్ని కొన్ని అడగాలని అనుకుంటున్నాను.. అది మీ జీవితంలో రాబోయే రెండు మూడు వారాలు నాకు కావాలి.

*🔸కరోనా వ్యాప్తి కూడా అంతకంతకూ పెరుగుతోంది. వివిధ దేశాల ప్రజలు కరొనాను ధైర్యంగా ఎదుర్కొన్నారు. భారతీయులందరు కరోనా విషయంలో జాగ్రత్తలు పాటించాలి

*♦️కరోనాకు ఇప్పటివరకు వ్యాక్సిన్ తయారు కాలేదు.

*🔹ప్రపంచం మొత్తం కరొనాతో పోరాడుతోంది. ఈ విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు, అందరం చేయి చేయి కలిపి ఈ మహమ్మారిని ఎదుర్కొందాం.

*🔸ఈ విషయంలో భారత ప్రజల పాత్ర చాలా కీలకమైనది, కరోనా కట్టడికి అన్ని దేశాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.

*🔹దేశంలోని 130 కోట్ల మంది ప్రజలు తమ సంకల్ప బలాన్ని మరింత పెంచుకోవాలి, తమకు కరోనా అంటకుండా, అలాగే ఇతరులకు కూడా కరోనా అంటకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు.

🔸రానున్న కొద్ది వారాలు కీలకమన్న మోదీ ఇప్పుడున్న కరోనా కంటే పెద్ద సమస్య లేదని వెల్లడించారు. వీలైనంత వరకు ప్రజలు తమ ఇంటినుంచి పనులు చేసుకోవాలని సూచించారు.

🔹అలాగే 60 ఏళ్ళు పైబడిన వృద్ధులు తమ ఇళ్లనుంచి బైటికి వెళ్లరాదని సూచించారు. సమూహాలకు దూరంగా ఉండాలని సూచించారు.

🔸ఏకాంతంగా ఉంటే ఈ మహమ్మారిని అరికట్టవచ్చు అని తెలిపారు.

♦️మార్చి 22 ఆదివారం ఉదయం 7 గంటలనుంచి రాత్రి 9 గంటల వరకూ ఎవరూ బయటికి రావొద్దని.. ప్రజలంతా జనతా కర్ఫ్యూ పాటించాలని సూచించారు.

🌼కరోనా

*♦ప్రధాని మోదీ ప్రసంగంలో ‍ కొన్ని అంశాలు

*భారత్‌ పై  కరోనా ప్రభావం లేదనుకోవడం తప్పు.

*గ్రూపులుగా తిరగవద్దు. స్వీయ నియంత్రణ అవసరం.

*సామూహిక కార్యక్రమాలకు దూరంగా వుండండి.

*కుటుంబంలోని సీనియర్ సిటిజన్లందరూ ఇళ్ళ నుండి బయటకు రావద్దు

*చాలా అవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు రావద్దని దేశ ప్రజలందర్ని కోరుతున్నాను.

*ఇంటి నుండే అన్ని పనులు చక్క బెట్టుకోండి.

*కరోనా మహమ్మారి ప్రభావాన్ని తగ్గించడంలో సామాజిక దూరం చాలా ముఖ్యమైంది.

*మార్చి 22 ఆదివారం జనతా కర్ఫ్యూ పాటిద్దాం. ఉదయం 7 గంటలనుంచి  రాత్రం 9గంటల వరకు దీన్ని పాటిద్దాం.

*5 సాయంత్రం గంటలకు అందరూ బైటికి వచ్చి 5 నిమిషాలు చప్పట్లు కొట్టండి.

 *కరోనా వ్యాప్తికి వ్యతిరేకంగా కృషి చేస్తున్న సిబ్బందికి కృతజ్ఞతగా ఇలా చేయాలి.

*నిత్యావసరాలు, అత్యవసర మందుల కొరత రాదు,  ఈ విషయంలో ప్రజలకు ఆందోళన అవసరం లేదు.

*వైద్య, శానిటేషన్‌ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు

*కేంద్రం ప్రభుత్వం నిర్దేశించిన మార్గ దర్శకాలను తప్పకుండా పాటించాలి.

*కరోనావైరస్ నుండి ఉత్పన్నమయ్యే ఆర్థిక సవాళ్లను దృష్టిలో ఉంచుకుని, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో కోవిడ్‌-19 ఎకనామిక్ రెస్పాన్స్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

*అనేక కష్టసమయాల్లో ప్రజలు తమ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. ఇపుడు కూడా ఇలాంటి సంయమనాన్నే ప్రజలు పాటించాలి.

*కరోనా మహమ్మారిపై  మానవజాతి తుది విజయం సాధించాలి

Thanks for reading Janata curfew across the country on Sunday: Modi New Guidelines for the Corona

No comments:

Post a Comment