కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న సుమారు 1357 ఉద్యోగాలు (టెక్నికల్, నాన్ టెక్నికల్) భర్తీ చేసేందుకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిల్లో పలు పోస్టులకు పదోతరగతి.. కొన్ని ఉద్యోగాలకు ఇంటర్మీడియెట్.. మరికొన్ని కొలువులకు డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు.
ఆయా పోస్టులకు ఎంపిక ప్రక్రియలో భాగంగా నిర్వహించే పరీక్షలో కామన్గా జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ నేపథ్యంలో.. ఎస్ఎస్సీ ఉద్యోగాల వివరాలు, అర్హతలు, ఎంపిక విధానం, ప్రిపరేషన్ టిప్స్...
విభాగాలు
కేంద్రంలోని జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, వీవర్స్ సర్వీస్ సెంటర్, సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్, నేషనల్ లైబ్రరీ, ఎన్ఎస్ఐ కాన్పూర్, డీటీఈ, ఎన్ఆర్ఎల్ తదితర విభాగాల్లో 1357 పోస్టులు భర్తీ చేయనున్నారు.
పోస్టుల వివరాలు
జూనియర్ ఇంజనీర్, సైంటిస్ట్ అసిస్టెంట్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్, సీనియర్ సర్వేయర్, ఇన్స్ట్రక్టర్, ఫొటో ఆర్టిస్ట్, సివిల్ ఇంజనీర్, ట్యూటర్ నర్సింగ్, స్టోర్ ఇంచార్జ్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ రీసెర్చ్ అసిస్టెంట్, క్యాంటీన్ అటెండెంట్, ల్యాబ్ అసిస్టెంట్, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, లైబ్రరీ క్లర్క్, టెక్స్టైల్ డిజైనర్, క్యాడెట్ ఇన్స్ట్రక్టర్, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అసిస్టెంట్ తదితర పోస్టులు ఉన్నాయి.
పదో తరగతి అర్హత పోస్టులు
టెక్నికల్ ఆపరేటర్(డ్రిల్లింగ్), లైబ్రరీ క్లర్క్(జనరల్), లైబ్రరీ క్లర్క్(బైండింగ్), ఆఫీస్ అటెండెంట్(ఎంటీఎస్), ఫీల్డ్ అటెండెంట్(మల్టీ టాస్కింగ్), ఫొటోగ్రాఫర్ మైక్రో, కాంపోసిటర్, క్యాంటీన్ తదితర పోస్టులు.
ఇంటర్/10+2 అర్హత పోస్టులు
ల్యాబ్ అసిస్టెంట్(జియాలజీ), ల్యాబ్ అసిస్టెంట్(కెమికల్), ల్యాబ్ అసిస్టెంట్(జియో ఫిజిక్స్), పుమిగేషన్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అటెండెంట్, ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్-3(జియాలజీ), జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్(డ్రిల్లింగ్) తదితర పోస్టులు.
డిగ్రీ అర్హత పోస్టులు
జూనియర్ ఇంజనీర్(వేర్వేరు విభాగాలు), ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ ఆఫీసర్, డైటీషియన్, టెక్నికల్ సూపరిండెంట్ (వీవింగ్), టెక్స్టైల్ డిజైనర్ తదితర పోస్టులు.
వయసు: దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం
ఆన్లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ తరహా పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పోస్టులను బట్టి పదోతరగతి, ఇంటర్, డిగ్రీ ఆపై అర్హత గలవారికి వేర్వేరుగా పరీక్షలు నిర్వహిస్తారు. -పరీక్ష మొత్తం 100 ప్రశ్నలు- 200 మార్కులకు ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ 25 ప్రశ్నలు-50 మార్కులు, జనరల్ అవేర్నెస్ 25 ప్రశ్నలు-50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలు-50 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 25 ప్రశ్నలు-50 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. నెగిటివ్ మార్కుల విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కుల కోత వేస్తారు.
పరీక్ష జూన్ రెండో వారంలో ఉన్నందున దాదాపు ఇంకా నాలుగు నెలల సమయం అందుబాటులో ఉంది. కాబట్టి అభ్యర్థులు ఇప్పటి నుంచే జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్పై పట్టు సాధించే ప్రయత్నం చేయాలి. ప్రిపరేషన్తోపాటు గత ప్రశ్న పత్రాలను, మోడల్ పేపర్లను తరచూ ప్రాక్టీస్ చేయాలి. మాక్టెస్టులు రాయడం ద్వారా ఎప్పటికప్పుడు ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకోవచ్చు.
ప్రిపరేషన్ ఇలా
పదోతరగతి, ఇంటర్, డిగ్రీ అర్హతలతో ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి వేర్వేరుగా పరీక్షలు నిర్వహిస్తారు. కాబట్టి సిలబస్లో తేడాలుంటాయి. ఎస్ఎస్సీ వెబ్సైట్లో సిలబస్ను క్షుణ్నంగా అధ్యయనం చేసి.. ప్రిపరేషన్కు ఉపక్రమించాలి. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటే... అందుబాటులో ఉన్న సమయం కేవలం 60 నిమిషాలు. కాబట్టి వేగంగా సమాధానాలు గుర్తించేలా ప్రాక్టీస్ చేయాలి. జనరల్ అవేర్నెస్పై ఎక్కువగా దృష్టిసారించడం ద్వారా ఎక్కువ స్కోర్కు అవకాశం ఉంటుంది. జనరల్ అవేర్నెస్ సముద్రమంత విస్తృతమైంది. ఇందులో హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్ తదితర అన్ని అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
కాబట్టి దీన్ని లోతుగా ప్రిపేర్ అవడం మేలు చేస్తుంది. పరీక్షకు సంవత్సరం ముందు వరకూ జరిగిన కరెంట్ అఫైర్స్పై దృష్టిపెట్టాలి. జనరల్ ఇంటెలిజెన్స్కు సంబంధించి వెర్బల్,నాన్ వెర్బల్ అంశాలపై ఫోకస్ చేయాలి. ఆయా పరీక్ష స్థాయిని బట్టి క్లిష్టత మారుతుంది. అనాలజీ, కోడింగ్- డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, ప్రాబ్లం సాల్వింగ్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి. రీజనింగ్కు సంబంధించి ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే.. అన్ని ఎక్కువ మార్కులు సాధించే వీలుంటుంది. ఇంగ్లిష్కు సంబంధించి బేసిక్ గ్రామర్, వొకాబ్యులరీపై దృష్టిపెట్టడం, గత ప్రశ్నలను ప్రాక్టీస్ చేయడం ద్వారా మంచి స్కోర్చేయొచ్చు. ప్రస్తుతం ఆన్లైన్ మార్గాల్లో మెటీరియల్ విస్తృతంగా అందుబాటులో ఉంది. ప్రామాణిక మెటీరియల్ను చదవడం మేలు.
పరీక్ష కేంద్రాలు
తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు.
ముఖ్య తేదీలు
దరఖాస్తు ఫీజు: రూ.100
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 20 మార్చి 2020
పరీక్ష నిర్వహణ: జూన్ 10, 11, 12
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://ssc.nic.in
Thanks for reading Staff Selection Commission- Jobs
No comments:
Post a Comment