The lockdown has been announced to be extended until May 3
Prime Minister Shri Narendra Modi address to the nation on COVID -19 i.e 14th April 2020 at 10 AM .
అందరూ ఊహించినట్లుగానే దేశవ్యాప్తంగా లాక్డౌన్ను పొడిగించింది కేంద్రం. మే 3వరకు అమల్లో ఉండనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
లాక్డౌన్ను మే 3వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న సమయంలో... ఎలా ముందుకు వెళ్లాలని అందరితో సంప్రదింపులు జరిపిన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.ఏ ఒక్కరూ కరోనా బారినపడకూడదన్నదే తమ లక్ష్యమని... ప్రతి పౌరుడు ఇందుకు సహకరించాలని కోరారు. ఇప్పటిలాగే క్రమశిక్షణతో ముందుకుసాగి.. కరోనాపై పోరులో విజయం సాధించాలని ఆకాంక్షించారు.మొదట ప్రకటించిన 21 రోజుల లాక్డౌన్ ఇవాళ్టితో ముగియనున్న నేపథ్యంలో జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ... పలు కీలక వ్యాఖ్యలు చేశారు.ఏప్రిల్ 20 నుంచి సడలింపులు...హాట్స్పాట్లుగా మారే ప్రమాదం ఉన్న ప్రాంతాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని అన్నారు మోదీ. కరోనా తీవ్రత తక్కువ ఉన్న ప్రాంతాల్లో ఏప్రిల్ 20 నుంచి కొంత మేర సడలింపులు చేయనున్నట్లు పేర్కొన్నారు.కొత్త కేసులు రాకుండా చూడటమే అసలైన సవాల్ అని.. ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని కోరారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే సడలింపులన్నీ రద్దు చేస్తామని హెచ్చరించారు.
Thanks for reading The lockdown has been announced to be extended until May 3
No comments:
Post a Comment