Whatsapp can now talk to 8 people at once….
వాట్సాప్ లో ఇప్పుడు ఒకేసారి 8 మందితో మాట్లాడవచ్చు....
వినియోగదారులకు తీపికబురు వినిపించింది సామాజిక మాధ్యమ దిగ్గజం వాట్సాప్. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా కోట్లాది మంది ప్రజలు ఇళ్లకే పరిమితమైన వేళ కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒకేసారి 8 మందితో మాట్లాడేలా ఆడియో, వీడియో కాలింగ్ పరిమితిని పెంచింది
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున చాలా దేశాల్లో లాక్డౌన్ విధించారు. ఈ కారణంగా కోట్లాది మంది ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలా ఇళ్లలో ఉంటున్నవారు తమకు ఇష్టమైన వారితో మాట్లాడేందుకు గ్రూప్ వీడియో కాల్స్ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో వినియోగదార్లకు శుభవార్త వినిపించింది వాట్సాప్. ఇకపై ఒకేసారి 8 మందితో వాయిస్ కాల్ లేదా వీడియో కాల్ చేసి మాట్లాడవచ్చని ఈ ఫేస్బుక్ అనుబంధ సంస్థ తెలిపింది.
ఇలా పొందండి..ఇప్పటివరకు వాట్సాప్ ద్వారా నలుగురు మాత్రమే వీడియో కాల్ మాట్లాడేవారు. ఇప్పుడు ఆ పరిధిని ఎనిమిదికి పెంచింది సంస్థ. అయితే ఇందుకోసం టెస్ట్ఫ్లైట్ నుంచి 2.20.50.25 ఐఓఎస్ బీటా అప్డేట్ను పొందవచ్చు. లేదంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి 2.20.133 బీటాను పొందాలి.రెట్టింపైన వినియోగంలాక్డౌన్ నుంచి వీడియో కాల్స్ వినియోగం పెరిగింది. ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా గ్రూప్ వీడియో కాల్స్ను 70 శాతం కంటే ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. అదే విధంగా వాట్సాప్ వాయిస్, వీడియో కాల్స్ వాడకం రెట్టింపు స్థాయిలో పెరిగింది.యాపిల్ అందించే ఫేస్టైమ్ వీడియో కాలింగ్ ద్వారా ఒకేసారి 32 మందికి అవకాశం ఉండగా ఫేస్బుక్ మెసెంజర్లో 50 మంది మాట్లాడొచ్చు.
Thanks for reading Whatsapp can now talk to 8 people at once….
No comments:
Post a Comment