Lockdown5.0 until June 30
జూన్ 30 వరకు లాక్డౌన్ -కంటైన్మెంట్ జోన్ల వరకే
దిల్లీ: దేశవ్యాప్త లాక్డౌన్ను కేంద్రం మరోసారి పొడిగించింది. ఈ సారి కేవలం కంటైన్మెంట్ జోన్ల వరకే పరిమితం చేసింది. జూన్ 30 వరకు కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ కొనసాగుతుందని కేంద్రం ప్రకటించింది. రేపటితో లాక్డౌన్ 4.0 ముగుస్తున్న నేపథ్యంలో ఈ మేరకు హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే లాక్డౌన్ 5.0కు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను కేంద్రం ప్రకటించింది. దశలవారీగా కొన్ని మినహాయింపులను ఇచ్చింది. రాత్రి పూట కర్ఫ్యూ విషయంలో సడలింపులు ఇచ్చింది. ఇకపై రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 వరకు మాత్రమే కర్ఫ్యూ కొనసాగనుంది.
ఫేజ్-1
* జూన్ 8 నుంచి దేవాలయాలు, ప్రార్థనా మందిరాలకు కేంద్రం అనుమతిచ్చింది.
* జూన్ 8 నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు, ఆతిథ్య సేవలు, షాపింగ్ మాల్స్కు అనుమతి
ఫేజ్-2
* పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు తెరిచే అంశం రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలతో చర్చించాక నిర్ణయం
* ఆయా రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు.. తల్లిదండ్రులు, యాజమాన్యాలతో చర్చించాలి. వారి నుంచి ఫీడ్బ్యాక్ ఆధారంగా విద్యాసంస్థల పునఃప్రారంభంపై జులైలో నిర్ణయం
వీటికి అనుమతి లేదు..
* మెట్రో రైలు సేవలకు అనుమతి లేదు.
* అంతర్జాతీయ విమాన సేవలకు అనుమతి లేదు.
* సినిమా హాల్స్, జిమ్లు, స్విమ్మింగ్పూల్స్, పార్కులు, బార్లు, రాజకీయ, సామాజిక, క్రీడా కార్యక్రమాలపై ప్రస్తుతానికి అనుమతి లేదు.
అంతర్రాష్ట్ర రవాణాపై నిషేధం ఎత్తివేత
లాక్డౌన్ 5.0లో భాగంగా అంతర్రాష్ట్ర రవాణాపై కేంద్ర హోంశాఖ నిషేధం ఎత్తివేసింది. అయితే, రవాణా అనుమతించే విషయం ఇరు రాష్ట్రాల నిర్ణయాన్ని బట్టి ఉంటుందని తెలిపింది. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రజలు ప్రయాణించాలంటే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
Thanks for reading Lockdown5.0 until June 30
No comments:
Post a Comment