English medium: The details mentioned in the petition are as follows
🔸ఇంగ్లిష్ మీడియం రద్దు తీర్పుపై సుప్రీంలో ఏపీ ప్రభుత్వం అప్పీల్
🔹ఇంగ్లీష్ మీడియం కావాలని తల్లిదండ్రులంతా కోరుతున్నారు
🔸హైకోర్టు తీర్పును రద్దు చేయాలి
🔹సాక్షి, న్యూఢిల్లీ : ఏపీలో పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ విన్నపం మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ తెచ్చిన జీవో 85ను హైకోర్టు రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది.
🔹ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున మహ్ పూజ్ ఏ.నజ్కీ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.
🍁పిటిషన్లో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి.
🔹మాధ్యమం అనేది విద్యా శాఖ గానీ, రాష్ట్రాలు గానీ తీసుకునే విధానపరమైన నిర్ణయం.
🔸భాషకు సంబంధించిన విధానాన్ని ఎలా మెరుగ్గా అమలు చేయాలో రాష్ట్రానికి తెలుసు. ఇది కోర్టులు జోక్యం చేసుకునే అంశం కాదు' అని ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ పేరెంట్స్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
🔸95 శాతం తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమాన్ని కోరుకుంటున్నారు.
🔹ఇంగ్లిష్ భాష జీవనోపాధి ఇచ్చే భాషగా మారింది. చిన్న వయసులోనే ఇంగ్లిష్ ను పరిచయం చేయడం ద్వారా ఆ భాషను సులువుగా ఆకళింపు చేసుకోవచ్చు.
🔸గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు, పేద పిల్లలు, నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీల పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు లేక తెలుగు మీడియంలోనే చదువుకుంటున్నారు.
🔹నిరుపేదలు మగ పిల్లలను ప్రైవేటులో ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నారని, ఆడపిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపుతున్నారని, ప్రభుత్వమే ఇంగ్లీష్ మీడియం బోధిస్తే విద్యావకాశాల్లో లింగ సమానత్వం తేవొచ్చు.
🔸తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా ఉంచడంతోపాటు అన్ని స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేయాలని అసెంబ్లీ ఏకగ్రీవంగా అభిప్రాయపడింది.
🔹తెలుగు మీడియంలో చదవాలనుకునే విద్యార్థులకు ప్రతి మండలంలో ఒక పాఠశాల ఉంటుంది. ఈ దృష్ట్యా హైకోర్టు వెలువరించిన తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులివ్వాలి.
Thanks for reading English medium: The details mentioned in the petition are as follows
No comments:
Post a Comment