నేడు ఏపీ కేబినెట్ కీలక భేటీ ... చర్చించనున్న అంశాలు ఇవే ... !
ఏపీలో కొత్త జిల్లాలపై చర్చ జోరందుకుంది . నేడు జరగనున్న ఏపీ కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై ముందడుగు పడే సూచనలు కనిపిస్తున్నాయి . మొత్తం 20 అంశాలపై కేబినెట్ చర్చించనుండగా..కొత్త జిల్లాల ఏర్పాటుపైనే ఫోకస్ ఎక్కువ కనిపిస్తోంది . జిల్లాల ఏర్పాటుకు సంబంధించి జగన్ సర్కార్ ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం . కేబినెట్ భేటీలో దీనిపై విస్తృతంగా చర్చించనున్నారు . ప్రజంట్ ఉన్న 13 జిల్లాలను 25 జిల్లాలుగా వర్గీకరించనున్నారు . ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఓ జిల్లా ఉండేలా గవర్నమెంట్ ప్రణాళికలు రూపొందిస్తోంది . దీనికి సంబంధించిన కసరత్తు త్వరలోనే ప్రారంభం కానుంది . ఈ అంశంపై అధ్యయనం చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి . రాష్ట్రంలో ఇసుకకు సంబంధించి కీలక నిర్ణయాల దిశగా ఏపీ సర్కార్ ముందడుగు వేస్తోంది . ఇసుక కొరత తీర్చేందుకు ఉపకరించే చర్యలతోపాటు ... అక్రమాలకు తావు లేకుండా మరో కీలక నిర్ణయం తీసుకోనే సూచనలు కనిపిస్తున్నాయి . ఇసుక అక్రమాలను నియంత్రించేందుకు ఇప్పటికే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే . తాజాగా మరో ప్రత్యేక వ్యవస్థను ఇసుక సంబంధించి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది . దీనిపై కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం . ఇసుక సరఫరా కోసం ప్రత్యేకంగా శాండ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది . ఇక వివిధ ప్రభుత్వ శాఖల్లో పోస్టుల ఏర్పాటుకు కెబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది . రాజధానుల ఏర్పాటు .. తరలింపు అంశంతోపాటు .. కొత్తగా అమలు చేయాల్సిన సంక్షేమ పథకాల పైనా కేబినెట్ భేటీలో చర్చించనున్నారు .
Thanks for reading AP cabinet meeting ... These are the topics to be discussed ...!
No comments:
Post a Comment