Breaking : కరోనా మృతుల అంత్యక్రియలకు రూ . 15 వేలు .. జగన్ సర్కార్ సంచలనం ..
Corona Andhra : రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణ , నివారణ చర్యలపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు . కరోనాతో మరణించిన వారి అంత్యక్రియల విషయంలో తాజాగా రాష్ట్రంలో చోటు చేసుకున్న ఘటనలపై సీఎం సీరియస్ అయ్యారు . కరోనా మృతుల అంత్యక్రియలకు రూ . 15 వేలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు . కరోనా రోగులకు చికిత్స అందించేందుకు ఆసుపత్రులు నిరాకరించకూడదని , అలా నిరాకరిస్తే ఆసుపత్రుల అనుమతులు రద్దు చేస్తామని సీఎం హెచ్చరించారు . కంటైన్మెంట్ జోన్లలో ప్రత్యేక బస్సుల ద్వారా కోవిడ్ టెస్టులు నిర్వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు . అంతేకాకుండా కరోనాపై ప్రజలను నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక కాల్ సెంటర్ను ఏర్పాటు చేయాలన్నారు . కోవిడ్ కేర్ సెంటర్లు , కోవిడ్ ఆసుపత్రులు , క్వారంటైన్ సెంటర్లపై వచ్చే వారం రోజుల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు .
Thanks for reading Breaking : కరోనా మృతుల అంత్యక్రియలకు రూ . 15 వేలు .. జగన్ సర్కార్ సంచలనం ..
No comments:
Post a Comment