నవరత్నాల అమలులో భాగంగా "జగనన్న తోడు" పథకంలో భాగంగా చిరు వ్యాపారుల అభివృధ్ధిని ఆకాంక్షిస్తూ ఒక్కొక్కరికి రూ.10,000లు లోపు వడ్డీ లేని ఋణం ఇవ్వడం జరుగుతుంది. ఈ ఋణం తిరిగి చెల్లించవలెను.
కావున వాలంటీర్లు అందరూ మీ పరిధిలోగల చిరువ్యాపారులను సర్వే చేసి, వివరాలు మీకు ఇవ్వబడిన గ్రామవాలంటీర్ యాప్ లో నమోదుచేయగలరు. ఈ సర్వేకు చివరితేది 13 జూలై 2020 వరకు మాత్రమే ఉంది.
ఈ పథకానికి కావలసిన అర్హతలు.
👉18 సం.లు నిండి ఉండాలి.
👉నెలసరి ఆదాయం రూ.10,000ల లోపు ఉండాలి
👉పొలం 10 ఎకరాల లోపు ఉండాలి.
👉విద్యుత్ వినియోగం 300యూనిట్లలోపు ఉండాలి.
👉ఆదాయపు పన్ను చెల్లించేవారు అనర్హులు
👉నాలుగు చక్రాల వాహనం కలిగియుండరాదు.
👉షాపు రిజిష్ర్టేషన్ గుర్తింపు పత్రం ఉండవలెను.
ఈ పథకానికి చిరువ్యాపారులు, తోపుడు బండ్లు మీద, గంపలలో వస్తువులు మోస్తూ అమ్ముకునే వారు అర్హులు.
ఈ పథకంలో భాగంగా అర్హులైన వారికి రూ.10,000వ డ్డీలేని ఋణం ఇవ్వబడుతుంది.అనగా మొదటగా ఋణగ్రహీత ఋణం తిరిగి చెల్లించవలెను. ఈ ఋణానికి కాబడిన పూర్తి వడ్డీని ప్రభుత్వం ఋణగ్రహీతకు తిరిగి చెల్లింస్తుంది..
🌟అనర్హులకు అప్లై చేస్తే పూర్తి బాధ్యత వాలంటీర్లదే అవుతుంది.
Thanks for reading Jagananna Thodu : జగనన్న తోడు- ఈ పథకానికి కావలసిన అర్హతలు.
No comments:
Post a Comment