Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, August 2, 2020

Shock to Bank Customers New Rules from August 1st.


Shock to Bank Customers New Rules from August 1st.
బ్యాంక్ కస్టమర్లకు షాక్ ఆగస్టు 1 నుంచి క్రొత్త రూల్స్.

ఆగ‌ష్టు 1వ తేదీ నుంచి కొన్ని రూల్స్ మార‌బోతున్నాయి. కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. కార్లు, బైకుల ధ‌ర‌ల భారం క‌స్టమ‌ర్ల‌పై త‌గ్గ‌బోతుంది. ఆగ‌ష్టు 1వ నుంచి రైతుల ఖాతాల్లోకి ప్ర‌ధాని మంత్రి కిసాన్ యోజ‌న ప‌థ‌కం డబ్బులు కూడా జ‌మ కాబోతున్నాయి. అంతేకాదు.. ఇంకా చాలా మార్పులు జ‌ర‌గబోతున్నాయి. వాటిలో ముఖ్య‌మైన ఐదు అంశాల గురించి తెలుసుకోండి.

1. ఐఆర్‌డిఏః కొత్త బైక్ లేదా కార్ కొనేవారికి ఐఆర్‌డీఏఐ (ఇన్స్యూరెన్స్ రెగ్యులేట‌రీ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండి) శుభ‌వార్త చెప్పింది. ఆగ‌ష్ట్ 1 నుంచి కార్లు, బైకులు కొనేవారికి కొత్త రూల్స్ వ‌ర్తించ‌బోతున్నాయి. ఇంత‌కుముందు వ‌ర‌కూ లాంగ్ ట‌ర్మ్ వెహిక‌ల్ ఇన్యూరెన్స్ ప్యాకేజీ పాల‌సీలు తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రిగా ఉండేది. కానీ ఇక‌పై అలాంటా ప్యాకేజీలు తీసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. కాబ‌ట్టి క‌స్ట‌మ‌ర్ల‌కు కార్లు లేదా బైకుల ఆన్ రోడ్ ధ‌ర త‌గ్గుతుంది.

2. ఇ-కామ‌ర్స్ః ఆగ‌ష్టు 1 నుంచి ఇ-కామ‌ర్స్ కంపెనీలు ఉత్ప‌త్తుల‌పై ఏ దేశానికి చెందిన ప్రోడెక్ట్ అన్న విష‌యాన్ని వివ‌రించాల్సి ఉంటుంది. అంటే వినియోగ‌దారులు కొనే ప్రోడ‌క్ట్స్‌పై మేడ్ ఇన్ ఇండియాలో త‌యారు చేసిన వ‌స్తువులా? లేదా ఇత‌ర దేశాల్లో త‌యారైన ప్రోడ‌క్ట్సా అని గుర్తించేందుకు వీలుగా ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలు ఆగ‌ష్టు 1 నుంచి అమ‌లులోకి రాబోతున్నాయి.

3. ఆర్బీఐః ఆగ‌ష్టు 1వ తేదీ నుంచి ఆర్బీఐ సేవింగ్స్ అకౌండ్ల‌పై వ‌డ్డీ రేట్లు మార‌బోతున్నాయి. రేప‌టి నుంచి కొత్త వ‌డ్డీ రేట్లు అమ‌లులోకి వ‌స్తాయి. ల‌క్ష రూపాయ‌ల‌లోపు ఉంటే 4.75 శాతం, ల‌క్ష నుంచి 10 ల‌క్ష‌ల మ‌ధ్య ఉంటే 6 శాతం, 10 ల‌క్ష‌ల నుంచి 5 కోట్ల ఉంటే 6.75 శాతం వ‌డ్డీ ల‌భిస్తుంది. అలాగే డెబిట్ కార్డ్ పోగొట్టుకున్నా, డ్యామెజ్ అయి.. కొత్త కార్డుకు అప్లై చేసుకుంటే రూ.250 చెల్లించాలి.

4. మినిమ‌మ్ బ్యాలెన్స్ః క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఇన్ని రోజులు మినిమ‌మ్ బ్యాలెన్స్ నిబంధ‌న‌లు ఎత్తివేశాయి బ్యాంకులు. అయితే అన్‌లాక్ 3.0లో భాగంగా ఆగ‌ష్టు 1 నుంచి మినిమ్ బ్యాలెన్స్ రూల్స్ మార‌నున్నాయి. యాక్సిస్ బ్యాంక్, కొట‌క్ మ‌హీంద్రా బ్యాంక్‌, ఆర్‌బీఎల్ బ్యాంక్‌, బ్యాంక్ ఆఫ్ మ‌హారాష్ట్ర మూడు ఫ్రీ ట్రాన్సాక్ష‌న్స్ త‌ర్వాత క‌స్ట‌మ‌ర్ల నుంచి ఛార్జీలు వ‌సూలు చేయ‌నున్నాయి.*
5. పీఎం కిసాన్ః ప్ర‌ధాని మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి ప‌థకం డబ్బుల్ని.. కేంద్ర ప్ర‌భుత్వం  నుంచి రైతుల ఖాతాల్లో జ‌మ చేయ‌నుంది. రెండు వేల రూపాయ‌ల చొప్పున ఆరో ఇన్‌స్టాల్‌మెంట్‌ను రైతుల ఖాతాల్లోకి బ‌దిలీ చేయనుంది.

Thanks for reading Shock to Bank Customers New Rules from August 1st.

No comments:

Post a Comment