పెండింగ్ లో ఉన్న 4 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ !
డీఎస్సీ-2018 నిర్వహించి దాదాపు రెండేళ్లు కావస్తున్నా ఇంతవరకూ అన్ని పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయలేదు. ఈ కారణంగా... కొత్త డీఎస్సీ ప్రకటన నిలిచిపోయింది. ఫలితంగా నిరుద్యోగులకు ఎదురుచూపులు తప్పట్లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, కరోనా ప్రభావంతో ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య పెరుగుతుందంటున్న అధికారులు.. ఆ మేరకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై దృష్టి సారించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నియామకాలు పెండింగ్లో పడుతున్నాయి.
సగానికిపైగా..
* డీఎస్సీ-2018లో 7,902 పోస్టులు ప్రకటించగా.. ఇప్పటికీ భర్తీకానివే 4,481 ఉన్నాయి. వీటిలో 3,666 sgt లు ఉన్నాయి
* తొలిసారిగా గత డీఎస్సీకి ఆన్లైన్ పరీక్ష నిర్వహించారు. దీంతో ఎస్జీటీ పరీక్షలు 16 సెషన్లలో జరిగాయి.
* ఒక విడతలో ప్రశ్నపత్రం తేలిగ్గా, మరో విడతలో కఠినంగా వచ్చిందని.. మొత్తం పరీక్షను సాధారణీకరణ (నార్మలైజేషన్) చేయాలని కోరుతూ కొందరు sgt అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఈరోజు న్యాయస్థానం వీరి వాదనను కొట్టివేసింది,
Dsc 2018 సెలెక్టెడ్ అభ్యర్థులకు మరియు ప్రభుత్వ
అనుకూల తీర్పు రావటంతో ఇక నియామక ప్రక్రియ
మళ్ళీ ప్రారంభం అవుతుంది.
మళ్ళీ ప్రారంభం అవుతుంది.
Thanks for reading Line clear to replace 4 thousands of teacher posts!
No comments:
Post a Comment