Unlock4.0 Guidelines In Andhra Pradesh.
కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం అన్లాక్ 4.0 గైడ్లైన్స్ జారీ చేసింది. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 30 వరకు పాఠశాలలు, విద్యాసంస్థలు బంద్ కానున్నాయి. అటు కంటైన్మెంట్ జోన్లలో కూడా ఈ నెల 30 వరకు లాక్డౌన్ కొనసాగనుంది. అటు సెప్టెంబర్ 21 నుంచి 9-12 తరగతుల విద్యార్థులు స్కూళ్లకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వగా.. ఇందుకు తల్లిదండ్రుల నుంచి రాతపూర్వక అంగీకారం తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఏపీ సర్కార్ జారీ చేసిన మరికొన్ని మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి. (Unlock4.0 Guidelines In Andhra Pradesh)
●సెప్టెంబర్ 21 నుంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు అనుమతి.
●ప్రాజెక్టులు, పరిశోధనల కోసం పీహెచ్డీ, పీజీ విద్యార్థులకు అనుమతి.
●సెప్టెంబర్ 21 నుండి 100 మందికి మించకుండా సామాజిక, విద్య, స్పోర్ట్స్, మతపరమైన, పొలిటికల్ సమావేశాలకు అనుమతి.
●సెప్టెంబర్ 20 నుంచి పెళ్లిళ్లకు 50 మంది అతిథులతో అనుమతి, అంతక్రియలకు 20 మందికి అనుమతి
●సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్మెంట్ పార్క్లకు అనుమతి నిరాకరణ
●ఈ నెల 21 నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లు తెరుచుకోవచ్చు.
Thanks for reading Unlock4.0 Guidelines In Andhra Pradesh.
No comments:
Post a Comment