ఉపాధ్యాయులకు శుభవార్త .
ఉద్యోగులు బదిలీలకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ .
రెండు- మూడు రోజుల్లో ఉత్తర్వులు ఎట్టకేలకు ఉపాధ్యాయులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఉపాధ్యాయ బదిలీలకు ఆమోదం లభించింది . దీనికి సంబంధించిన ఫైలు పై ఈ రోజు ముఖ్యమంత్రి జగన్ సంతకం చేశారు . దీనిపై ఉత్తర్వులు రెండు మూడు రోజుల్లో వెలువడనున్నాయని . ఏపిజిఈఎఫ్ ఛైర్మన్ వెంకటరామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు . ఫిబ్రవరి 29 , 2020 నాటికి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులందరూ బదిలీలకు అర్హులు . వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఈ బదిలీలు కార్యక్రమం చేపడతారు . మూడు సంవత్సరాలుగా బదిలీల కోసం ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులకు ఇది శుభవార్తె .
Thanks for reading Teachers Transfers 2020
No comments:
Post a Comment