AP Media bulletin: Details of today's Covid-19 cases@Date:11.11.20
అమరావతి: ఏపీలో కొత్తగా 1,732 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 14 మంది మృత్యువాత పడినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తన బులెటిన్లో పేర్కొంది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,47,977కి చేరింది. ఇప్పటి వరకు 6,828 మంది మృత్యువాత పడ్డారు. తాజాగా మరో 1,761 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 8.20 లక్షలకు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 20,915కి చేరింది.
గడిచిన 24 గంటల్లో 70,405 కరోనా శాంపిళ్లను పరీక్షించినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. మొత్తంగా ఇప్పటి వరకు 88.63 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది. కొవిడ్ వల్ల తాజాగా కృష్ణా జిల్లాలో ముగ్గురు; అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నం, పశ్చిమగోదావరిలో ఇద్దరేసి; తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరులో ఒక్కరు చొప్పున మరణించారు
Thanks for reading AP Media bulletin: Details of today's Covid-19 cases@Date:11.11.20
No comments:
Post a Comment