AP Media bulletin: Details of today's Covid-19 cases@Date:16.11.20
అమరావతి: ఏపీ ప్రభుత్వం కరోనా బులెటిన్ విడుదల చేసింది. ఒక్కరోజు వ్యవధిలో 43,044 నమూనాలను పరీక్షించగా 753 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,54,764కి చేరింది. 24 గంటల వ్యవధిలో కొవిడ్ చికిత్స పొందుతూ 13 మంది మృతిచెందారు. చిత్తూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో ఇద్దరేసి.. అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో కొవిడ్తో మృతిచెందిన వారి సంఖ్య 6,881కి చేరింది. ఒక్కరోజులో 1,507 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 17,892 యాక్టివ్ కేసులన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 91,97,307 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్లో పేర్కొంది.
Thanks for reading AP Media bulletin: Details of today's Covid-19 cases@Date:16.11.20
No comments:
Post a Comment