AP Media bulletin: Details of today's Covid-19 cases@Date:17.11.20
అమరావతి: ఏపీ ప్రభుత్వం కరోనా బులెటిన్ విడుదల చేసింది. ఒక్కరోజులో 66,778 నమూనాలను పరీక్షించగా 1,395 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 8,56,159కి చేరింది. 24 గంటల వ్యవధిలో కరోనా చికిత్స పొందుతూ 9 మంది మృతిచెందారు. చిత్తూరు, కృష్ణా, విశాఖ జిల్లాల్లో ఇద్దరేసి.. అనంతపురం, తూర్పుగోదావరి, కడప జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 6,890కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 2,293 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 16,985 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 92,64,085 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్లో పేర్కొంది.
Thanks for reading AP Media bulletin: Details of today's Covid-19 cases@Date:17.11.20
No comments:
Post a Comment