AP Media bulletin: Details of today's Covid-19 cases@Date:22.11.20
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 71,913 నమూనాలను పరీక్షించగా 1,121 మందికి కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,62,213కి చేరింది. తాజాగా కరోనా మహమ్మారితో 11 మంది మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 9,938కి చేరింది. గడిచిన 24 గంటల్లో 1,631 మంది కరోనా నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లిపోగా.. ఇప్పటివరకు 8,41,026 మంది కోలుకున్నట్లు బులెటిన్లో తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,249 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 96,15,090 కరోనా సాంపుల్స్ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్లో పేర్కొంది. గడిచిన 24 గంటల్లో చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఇద్దరు కరోనాతో ప్రాణాలు కోల్పోగా.. అనంతపురం, తూర్పు గోదావరి,గుంటూరు, కడప, విశాఖ, విజయనగరం, పశ్చిమ గోదావరిలో ఒక్కరు చొప్పున మృతి చెందారు.
Thanks for reading AP Media bulletin: Details of today's Covid-19 cases@Date:22.11.20
No comments:
Post a Comment