AP Media bulletin: Details of today's Covid-19 cases@Date:24.11.20
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 65,101 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,085 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఎనిమిది మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,63,843కు చేరింది. గడిచిన 24 గంటల్లో 1,447 మంది బాధితులు పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు కోలుకొని 8,43,863 మంది ఇళ్లకు వెళ్లిపోయారు. తాజా మరణాలతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 6,956 మంది కొవిడ్తో మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,024 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 97,27,321 కరోనా సాంపుల్స్ని వైద్యారోగ్య శాఖ పరీక్షించింది. కరోనాతో కృష్ణా జిల్లాలో ఇద్దరు చినిపోయారు. చిత్తూరు, తూర్పు గోదావరి, గుంటూరు, కడప, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో ఒక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.
Thanks for reading AP Media bulletin: Details of today's Covid-19 cases@Date:24.11.20
No comments:
Post a Comment