AP Media bulletin: Details of today's Covid-19 cases@Date:08.11.20
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 76,663 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,237 కొవిడ్ కేసులు నమోదు కాగా, 12 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,42,967కు చేరింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా మరణించిన వారితో కలిపి రాష్ట్రంలో మరణాల సంఖ్య 6,791కి చేరింది. గడిచిన 24 గంటల్లో 2,256 మంది బాధితులు పూర్తిగా కోలుకోగా.. రాష్ట్రంలో మొత్తంగా 8,14,773 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 21,403 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 86,63,975 కరోనా సాంపుల్స్ను పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్లో వెల్లడించింది.
కరోనాతో రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు, విశాఖలో ఇద్దరు చొప్పున మృతి చెందగా.. తూర్పు గోదావరి, గుంటూరు, నెల్లూరే, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందినట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్లో తెలిపింది.
Thanks for reading AP Media bulletin: Details of today's Covid-19 cases@Date:08.11.20
No comments:
Post a Comment