SBI కస్టమర్లకు శుభవార్త.. కొత్త సర్వీసులు అందుబాటులోకి
క్రెడిట్ కార్డు వాడే వారు సులభంగానే లావాదేవీలు పూర్తి చేయొచ్చు. కార్డు లేకపోయినా పని పూర్తవుతుంది.
ప్రధానాంశాలు:
ఎస్బీఐ కార్డు కొత్త సేవలు
మాస్టర్కార్డ్తో భాగస్వామ్యం
కస్టమర్లకు బెనిఫిట్
కోవిడ్ 19 కారణంగా కాంటాక్ట్లెస్ పేమెంట్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. కాంటాక్ట్లెస్ పేమెంట్ విధానంలో కస్టమర్లు వారి కార్డును స్వై్ప్ మెషీన్లో పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం ఫోన్ ద్వారానే ట్రాన్సాక్షన్ను పూర్తి చేయొచ్చు. జేబులో కార్డు కూడా ఉండాల్సిన పని లేదు.
ఇప్పుడు దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టే్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBIకు చెందిన అనుబంధ సంస్థ ఎస్బీఐ కార్డు తాజాగా తన యాప్లో కాంటాక్ట్లెస్ పేమెంట్స్ ఫీచర్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని కోసం ఎస్బీఐ కార్డ్.. మాస్టర్ కార్డ్తో జతకట్టింది. దేశంలో ఇలాంటి సేవలు అందిస్తున్న తొలి క్రెడిట్ కార్డు సంస్థగా ఎస్బీఐ కార్డ్ నిలిచింది.
కొత్త సేవలు అందుబాటులోకి రావడంతో ఎస్బీఐ కార్డ్ మాస్టర్కార్ట్ కలిగిన వారు వారి కార్డును జేబులో పెట్టుకొని తిరగాల్సిన పని లేదు. మొబైల్ ఫోన్ ద్వారా కాంటాక్ట్లెస్ సేల్ టర్మినల్ వద్ద లావాదేవీలను పూర్తి చేయొచ్చు. రూ.2,000 వరకు లావాదేవీలకు ఇది వర్తిస్తుంది. ఆపైన ట్రాన్సాక్షన్లకు పిన్ నెంబర్ ఎంటర్ చేయాల్సిందే.
అదేసమయంలో ఎస్బీఐ క్రెడిట్ కార్డుదారులు ఈ సేవలు పొందాలని భావిస్తే.. వన్టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవలసి ఉంటుంది. అంతేకాకుండా కస్టమర్లు లేటెస్ట్ ఎస్బీఐ కార్డ్ మొబైల్ యాప్ను ఉపయోగించాలి. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న తర్వాత ఫోన్ను అన్లాక్ చేసి కాంటాక్ట్లెస్ పీఓఎస్ టర్మినల్ వద్దకు తీసుకెళ్తే ట్రాన్సాక్షన్ పూర్తవుతుంది. అయితే ఇక్కడ మీ ఫోన్లో కూడా ఎన్ఎఫ్సీ ఉండాలి.
Thanks for reading New services available to SBI customers
No comments:
Post a Comment