చిన్నమొత్తాల పొదుపు పథకాల్లో సొమ్ముపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం
దిల్లీ: బ్యాంకులు, చిన్నమొత్తాల పొదుపు పథకాల్లో సామాన్యుడు దాచుకొనే సొమ్ముపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పొదుపు ఖాతాల్లో డిపాజిట్లపై ఏడాదికి ప్రస్తుతం 4 శాతంగా ఉన్న వడ్డీ రేటును 3.5 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)పై ఇచ్చే వడ్డీపైనా కోత పెట్టింది. దీన్ని 7.1 శాతం నుంచి 6.4 శాతానికి తగ్గించింది. సీనియర్ సిటిజన్ల సేవింగ్ పథకాలపై ఇచ్చే వడ్డీని 7.4 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గించింది. సుకన్య సమృద్ధి యోజన పథకం ఖాతాలపై ఇచ్చే వడ్డీని 7.6 శాతం నుంచి 6.9 శాతానికి కుదించింది. సవరించిన ఈ వడ్డీ రేట్లు ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి రానున్నాయని కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు.
Thanks for reading Decision to reduce interest rates on small savings schemes
No comments:
Post a Comment