TS 10th Results : ‘పది’ ఫలితాలు విడుదల
హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వీటిని విడుదల చేశారు. 2,10,647 మంది విద్యార్థులు.. 10 జీపీఏ సాధించినట్లు మంత్రి వెల్లడించారు. మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలను bse.telangana.gov.in, results.cgg.gov.in తదితర వెబ్సైట్లలో అందుబాటులో ఉంచనున్నారు. ఈ సారి హాల్టికెట్లు జారీ చేయనందువల్ల.. చదివిన పాఠశాల పేరు, విద్యార్థి పేరు, పుట్టిన తేదీ వివరాలను వెబ్సైట్లో నమోదు చేస్తే హాల్టికెట్ నంబర్తోపాటు ఏ గ్రేడ్ వచ్చిందో తెలుసుకోవచ్చు.
ఫార్మేటివ్ అసెస్మెంట్(ఎఫ్ఏ)-1లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇచ్చారు. మొత్తం 5,21,393 మంది వార్షిక పరీక్షల కోసం ఫీజులు చెల్లించగా వారందర్నీ పాస్ చేస్తున్నట్లు ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది.
http://results.bsetelangana.org/results/
http://results.bse.telangana.gov.in/resultsmay
http://results.bsetelangana.org/schresults/account/login.aspx
http://results.bse.telangana.gov.in/schresults/account/login.aspx
Thanks for reading TS 10th Results 2020-21
No comments:
Post a Comment