AP News: ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు
అమరావతి: ఏపీలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో పగటి కర్ఫ్యూను పొడిగిస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కర్ఫ్యూను ఈ నెల 20 వరకు పొడిగించిన ప్రభుత్వం.. సడలింపు సమయాన్ని కూడా పెంచింది. ఇప్పటి వరకు ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం 12 వరకు ఉన్న సడలింపు సమయం.. ఈ నెల 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే విధించిన కర్ఫ్యూ గడువు 10వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో సీఎం వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గత నెల 5న పగటి కర్ఫ్యూని అమల్లోకి తీసుకొచ్చింది. 18వ తేదీ వరకూ నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపింది. ఆ తర్వాత కూడా కరోనా కేసుల్లో తగ్గుదల నమోదు కాకపోవడంతో మే నెలాఖరుకు వరకూ పొడిగించిన విషయం తెలిసిందే. గడువు ముగియడంతో సమీక్ష నిర్ణయించిన సీఎం జూన్ 10 వరకూ కర్ఫ్యూను పొడిగించారు. ఆ గడువు కూడా ముగుస్తుండటంతో ఇవాళ జగన్ మళ్లీ సమీక్ష నిర్వహించి 20వ తేదీ వరకూ కర్ఫ్యూను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 10వ తేదీ వరకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. 11 తేదీ నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, కార్యాలయాలు, రెస్టారెంట్లను అనుమతించనున్నారు.
Thanks for reading Curfew extension in AP
No comments:
Post a Comment