DSC 2008: అభ్యర్థులకు ప్రత్యేక రిక్రూట్మెంట్
అమరావతి: డీఎస్సీ-2008 అభ్యర్థుల్లో 2,193 మంది అర్హులకు ఎస్జీటీ పోస్టింగులివ్వాలని నిర్ణయించినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వీరికోసం ప్రత్యేక నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు చెప్పారు. మినిమమ్ టైమ్ స్కేల్ విధానంలో పని చేసేందుకు అభ్యర్థులు రాత పూర్వకంగా అంగీకారం తెలిపారన్నారు. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కేవలం డీఎస్సీ-2008 అభ్యర్థులకు మాత్రమే వర్తించేలా 2,193 మంది అర్హులకు ఎస్జీటీ పోస్టింగులివ్వాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. దీనికి సంబంధించి త్వరలోనే జీవో విడుదల చేస్తామని మంత్రి తెలిపారు.
2018 డీఎస్సీలో భాగంగా 486 పీఈటీ పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. అలాగే 2018 డీఎస్సీలో పెండింగ్లో ఉన్న 387 పోస్టులను సైతం భర్తీ చేస్తామన్నారు. ఏపీ టెట్ 2021 సిలబస్ సిద్ధం చేసి http://aptet.apcfss.in/ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు సురేష్ పేర్కొన్నారు.
Thanks for reading DSC 2008: Special Recruitment for Candidates
No comments:
Post a Comment