EVNREDCAP Android App
గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు రాయితీ ప్రాతిపదికన ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ వాహనాల కొనుగోలుకు సంబంధించి ఎన్టీపీసీ సహా ఎస్సైల్ సంస్థలు రాయితీ ఇస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పెట్టుబడి అందించదని పేర్కొంది.
వాయిదా పద్దతిలో స్వచ్ఛందంగా ఉద్యోగులే ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ వాహనాల కొనుగోలుకు సంబంధించి ఎన్టీపీసీ సహా ఎస్సైల్ సంస్థలు రాయితీ ఇస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
వాహనాలు కొనుగోలు చేసిన ఉద్యోగుల వేతనాల నుంచి... నెలవారీగా వాయిదాలను వసూలు చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచనలు జారీ చేసింది. దీనికి సంబంధించి సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ తగిన ఏర్పాట్లు చేస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. నెలకు 2500 రూపాయల వరకూ వాయిదా చెల్లించేలా వెలుసుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆసక్తిగల ఉద్యోగులు ఈ క్రింది ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా మీరు దరఖాస్తు చేయవలసి ఉంటుంది.
Thanks for reading EVNREDCAP Android App
No comments:
Post a Comment