ఎలక్ట్రిక్ బైక్ ను కొనుగోలు చెయ్యాలను కునే ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగులు తప్పక తెలుసు కోవాల్సిన విషయాలు.
ఆంధ్ర ప్రదేశ్ లో ఉద్యోగులకు ఇన్స్టాల్మెంట్ లపై ఇచ్చే ఎలక్ట్రిక్ బైక్ లు పరిస్థితి ?
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఈ-మొబిలిటీ పాలసీకి అనుగుణంగా అధునాతన మరియు పునరుత్పాద ఇంధన విభాగం (New & Renewable Energy Department Corporation of Andhra Pradesh -NREDCAP) 2030 లో కల్లా అన్ని నగరాలలో పెట్టోల్ ఆధారిత వాహనాలకు( ICE- Internal Combustion Engine) బదులు ఎలక్ట్రిక్ వాహనాలు(Elecrtonic Vehicles-EV) వాడుకలో ఉండే విధంగా, చేపట్టిన చర్యల్లో భాగంగా ఈ స్కీం ప్రవేశ పెట్టింది. దీనికి NTPC/EESL ( Energy Efficiency Services Limited ) ఫండింగ్ సదుపాయాన్ని కల్పిస్తోంది. దీని ద్వారా ఉద్యోగులు EMI తో వాహనాల్ని కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తూ , విస్తృతంగా ఎలక్ట్రిక్ వాహనాలని వాడుకలోకి తేవాలని చూస్తోంది. ఉద్యోగి తన DDO ద్వారా , జీతం నుంచి మొదటి EMI చెల్లింపు చేసిన తరువాత దీనిని ఉద్యోగికి అందిస్తారు. వీటిపై కొనుగోలు దారునికి సబ్సిడీ కూడా లభిస్తుంది. evnredcap.in లో వివరాలు నమోదు చెయ్యాల్సి ఉంటుంది.
భారత దేశంలో ఎలక్ట్రిక్ బైక్ ల పరిస్థితి ఏంటి ?
భారత్ లో ప్రస్తుతానికి 171 రకాల ఎలక్ట్రిక్ వాహనాలు (EV) ఉన్నాయి. 1990 ల నుంచి బ్యాటరీ టెక్నాలజీలో గణనీయ మైన ప్రగతి కారణంగా యివి పుంజుకున్నాయి. ప్రస్తుతానికి 15,000 రూపాయల నుంచి 20 లక్షల విలువ చేసే హార్లే డేవిడ్సన్ యొక్క లైవ్-వైర్ మోడల్ (భారత్ లో 2021 డిసెంబర్ లో )దాకా మార్కెట్లో ఉన్నాయి. కనీసం ₹90,000 పెట్టగలిగితే ఒక ఛార్జ్ తో 100 నుంచి 140 కిలోమీటర్ లు తిరిగే , 3kWt బ్యాటరీ గల ఎలక్ట్రిక్ బైక్ పొందొచ్చు.
ఎలక్ట్రిక్ బైక్ లు పెంచడానికి కేంద్రం ఏం చేసింది ?
2010 లో పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు 93 కోట్ల ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించడంతో ప్రోత్సాహకాలు ఇవ్వడం మొదలైంది.
2015 లో "త్వరిత గతిన ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ (పెట్రోల్ ప్లస్ ఎలక్ట్రిక్ ) వాహనాల స్వీకరణ మరియు తయారీ ( Faster Adoption and Manufaturing of Electric and Hybrid Vehicles -FAME ) పేరుతో కేంద్రం ప్రణాళిక వేసింది. దీన్నే ఫేమ్ అంటారు.
FAME-2 లో పెరిగిన రాయితీలు /సబ్సిడీ ఎంత ?
2019 లో అమలు లోకి వచ్చిన FAME-2 లో కనీసం ఒక ఛార్జ్ తో 80 కిలోమీటర్లు ప్రయాణించగలిగి, గంటకు 40 కిలోమీటర్లు కనీస వేగం కల్గిన ఎలక్ట్రిక్ వాహనానికి ప్రోత్సాహక గుర్తింపు ఇచ్చారు. వీటిలో ఒక 1KW బ్యాటరీ గల వాహనానికి 10000 రూపాయలు చొప్పున సబ్సిడీ ఇచ్చారు. దీన్నే 2021 జూన్ నెలలో మరో ₹5,000 పెంచి ₹15,000 చేసింది. బైక్ ధరపై సబ్సిడీ విలువ 40% కి ఎక్కువ కాకుండా అవధి నిర్ణయించారు.
అంటే ఒక లక్ష రూపాయల అమ్మే విలువ గల ఎలక్ట్రిక్ బైక్ పై 1 కిలోవాట్ బ్యాటరీ ఉంటే ₹15,000 రూపాయల రాయితీ (అంటే బైక్ ధర ₹85000) , 2 కిలోవాట్ ల బాటరీ ఉంటే ₹30,000 రూపాయల రాయితీ(అంటే బైక్ ధర ₹70,000) , 3 కిలోవాట్ లు ఉంటే ₹40,000 రాయితీ (అంటే 40% అవధి వల్ల బైక్ ధర ₹60000) అవుతుంది.
ఎలక్ట్రిక్ బైక్ నడపడానికి లైసెన్స్ అవసరమా?
అవసరమే. గంటకు 25 కిలోమీటర్ ల కన్నా ఎక్కువ స్పీడ్ ఉన్న ఎలాంటి ఎలాంటి ఎలక్ట్రిక్ బైక్ నడిపైనా డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే . కానీ కనీసం 18 ఏళ్ళు నిండి ఉండాలి. 16 ఏళ్ల నుంచే లైసెన్స్ తప్పని సరి చేసే ప్రతి పాదనలు కొత్తగా సవరణ చేయబోయే మోటార్ వెహికల్ చట్టం లో పొందు పరచాలని కేంద్రం యోచిస్తోంది.
ఇన్సూరెన్స్ అవసరమా?? లేదా ??
అవసరమే. నడిపే వ్యక్తి ఇన్సూరెన్స్ కలిగి ఉంటే ఉపయోగకరం. అలాగే కనీసం ఒక థర్డ్ లార్టీ లైసెన్స్ తప్పని సరి.
ఛార్జింగ్ పాయింట్ ల సంగతి ?
భారత్ లో ప్రస్తుతానికి ఎలక్ట్రికల్ వాహనాల కొరకు 1800 ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయి. ఈ సంఖ్య చాలా తక్కువ. అదే అమెరికా లో 30000 లకు పైగా ఉన్నాయి. భారత్ లో 2026 నాటికి 20 లక్షల ఈవీలకు 4 లక్షల ఛార్జింగ్ పాయింట్లు అవసర మౌతాయని ఒక అంచనా.
ఏ ఎలక్ట్రిక్ బైక్ కొనాలి ?
ప్రస్తుతానికి భారత్ మార్కెట్ లో Ather , Revolt, Okinawa, Hero elecric, Bajaj Chethak, TVS iQube లాంటి బ్రాండ్ లు ఉన్నాయి. వీటిలో బ్రాండ్ రెండు నుంచి మూడు సబ్-బ్రాండ్లు కలిగి ఉన్నాయి. ఇంకా చాలా రకాల ఈవీ లు ఉన్నప్పటికీ అన్నిటికి సబ్సిడీ అనుమతి లేదు. టెస్లా లాంటి అంతర్జాతీయ సంస్థ "టెస్లా మోటార్స్ ఇండియా" పేరుతో బెంగళూరు లో తమ బ్రాంచ్ ని స్ధాపించింది. అయితే మార్కెట్లో ఇంకా తమ వాహనాల ప్రవేశం జరపలేదు.
ఒకసారి ఛార్జ్ చేస్తే ఎంత దూరం పోతాయి ?
సాధారణ ₹50,000 విలువ చేసే ఎలక్ట్రిక్ వాహనాలు ఒకసారి ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్ ల వరకు పోతాయి. అయితే ఈ వాహనాల్లో ఈకో , మీడియం , సూపర్ స్పీడ్ అనే మూడు రకాలైన మోడ్ లని కలిగి ఉంటాయి. ఎకానమీ లో అయితే ఎక్కువ దూరం వెళ్లగలుగుతాయి. సూపర్ స్పీడ్ మోడ్ లో అవి అంత దూరాన్ని చేరుకోలేవు.
మార్కెట్ లో ఉన్న అన్ని ఎలక్ట్రిక్ బైక్ లపై సబ్సిడీ ఉందా ?
లేదు. కేంద్రం అనుమతి పొందిన వాటికి మాత్రమే FAME-2 సబ్సిడీ వర్తిస్తుంది. 10 కంపనీ లు మాత్రమే ఈ లిస్ట్ లో ఉన్నాయి. వాటి యొక్క సబ్-బ్రాండ్ లు కొనుగోలు ద్వారా సబ్సిడీ పొందవచ్చు. అందులో Hero,Ampere, Jitendra, Revolt, Benling Aura, Tunwal Electric, Spock Electric,TVS iqube, Ather, Okinawa . రానున్న కాలంలో మరిన్ని కంపెనీలు ఈ కోవలోకి వస్తాయి.
మనకి మిగిలే పెట్రోల్ ఖర్చు ఎంత ?
ఇంచుమించు అన్ని ఎలక్ట్రిక్ బైక్ లు లిథియం అయాన్ బ్యాటరీ తోనే నడుస్తున్నాయి. వీటి ఛార్జింగ్ సామర్థ్యం 70 -80 % ఉంటుంది అంటే 1 కిలో వాట్ ఉన్న బ్యాటరీ ని ఛార్జ్ చేయడానికి 1.2 kWh పవర్ ఖర్చు అవ్వవచ్చు. అంటే 1.2 యూనిట్లు అన్నమాట. 3 కిలోవాట్ బ్యాటరీ ఒకసారి ఛార్జింగ్ కి సుమారు 4 యూనిట్ల కరెంట్ ఖర్చు అవుతుంది.
ఆంధ్ర ప్రదేశ్ లో ఒక యూనిట్ విద్యుత్ ధర ₹6.37 గా ఉన్నది. అంటే 50 కిలోమీటర్లు మైలేజ్ ఉన్న పెట్రోల్ బండిలో ఒక కిలోమీటర్ దూరం వెళ్ళడానికి 2 రూపాయిల ఖర్చు అయితే, ఎలక్ట్రిక్ వాహనాల్లో 3 kWt (20 రూపాయలు )లతో 140 కిలో మీటర్లు ప్రయాణించే (ఈకో మోడ్ లో) వాహనాలు ఉండడం వల్ల, కిలోమీటర్ దూరం వెళ్ళడానికి సుమారు 14 పైసలు మాత్రమే ఖర్చు అవుతుంది. కాబట్టి డబ్బు ఖర్చు బాగా తగ్గుతుంది. అంటే సుమారు 99 % ఖర్చు తగ్గుతుంది. అయితే వీటి బ్యాటరీ లకు కనీసం 3 సంవత్సరాల గ్యారంటీ ఉన్నప్పటికీ, ధర మాత్రం ₹20,000 నుంచి ₹50,000 వరకు ఉంటాయి.
మరి పవర్ బిల్ సంగతేంటి ?
మూడు రోజులకు ఒకసారి ఛార్జింగ్ చేయాల్సి వస్తుందని అనుకుంటే అనుకుంటే నెలకు సుమారు 40 యూనిట్ల కరెంటు అదనంగా కలుతుంది. అంటే సుమారు 240 రుపాయలన్నమాట.
ఒక్కో.ఎలక్ట్రిక్ బైక్ కు ఎన్నేసి బ్యాటరీ లు ఉంటాయి?
సాధారణంగా ఒక్కో.బైక్ కి ఒకటి చొప్పున బ్యాటరీలు ఉంటాయి. కానీ కొన్నింటికి రెండు, మరి కొన్నింటికి మూడు బ్యాటరీలు కూడా ఉంటాయి. ఉదాహరణకు HERO NYX hx ఎలక్ట్రిక్ బైక్ మూడు బ్యాటరీ లను కలిగి ఉంటుంది.
ఎలక్ట్రిక్ బైక్ కొనేటప్పుడు ఇంకా ఏమేం అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి ?
బ్యాటరీ కెపాసిటీ 2.5 నుంచి 3.5 kWh ఉంటే ఎక్కువ దూరం ప్రయాణించే వీలు ఉంది. ఒక ఛార్జ్ తో కనీసం 80 కిలోమీటర్లు అయిన వెళ్ళేట్లు ఉండాలి. ఎందుకంటే ఒక సంవత్సరం గడిచాక అంతే Iస్థాయిలో బ్యాటరీ కెపాసిటీ ఉండదు. రాను రాను బైక్ పోయే దూరం ఒక 10 నుంచి 20 కిలోమీటర్లు తగ్గవచ్చు.
బైక్ కనీస స్పీడ్ 40kmph తగ్గకుండా ఉండాలి. లిథియం అయాన్ బ్యాటరీ అయితేనే తీసుకోవాలి. లెడ్ / నికెల్ బ్యాటరీలు సరి అయినవి కావు. బ్యాటరీ వారంటీ కాలాన్ని పరిశీలించాలి. మోటార్ పవర్ 2kW కన్నా తక్కువ కాకుండా చూసుకోవాలి . అప్పుడే బైక్ కదలడానికి సరైన టార్క్ ని మోటార్ అందించగలదు.
కొన్ని బైక్ ల బ్యాటరీలు చాలా బరువుగా ఉంటాయి. ఉదాహరణకు Revolt-rv400 బైక్ బ్యాటరీ 3.24 kWh లతో సుమారు 18 కేజీల బరువు ఉంటుంది. అయినప్పటికి ఇది ఒక్క ఛార్జింగ్ తో, ఈకో మోడ్ లో 150 కిలోమీటర్లు వెళ్ళగలదు.
అధునాతన ఫీచర్లు అయిన , సంస్థ స్వంత మొబైల్ యాప్, బైక్-మొబైల్ కనెక్టివిటీ, రిమోట్ లాకింగ్ , ఫాస్ట్ ఛార్జింగ్, రిమోట్ స్టార్టింగ్, జీవో ఫెన్సింగ్ (ఉన్న స్థలం నుంచి బైక్ చోరీకి గురై దూరంగా పోతే, మొబైల్ కి నోటిఫికేషన్ పంపడం), థెఫ్ట్ అలారమ్ లాంటివి ఉన్నాయేమో పరిశీలించాలి.
మనం కొనబోయే ఎక్కువ బైక్ ఛార్జింగ్ పోయింట్లని కలిగి ఉందో లేదో చూడాలి. కనీసం 2 రిమూవబుల్ బ్యాటరీలు కలిగి ఉంటే మంచిది.
Thanks for reading Things that Andhra Pradesh employees who want to buy an electric bike must know
No comments:
Post a Comment