వ్యాక్సినేషన్లో పాఠశాలల సిబ్బందికి అధిక ప్రాధాన్యత: సీఎం జగన్
✰ రాష్ట్రంలో ఉపాధ్యాయులతో పాటు పాఠశాలల్లో పనిచేస్తున్న సిబ్బందికి వ్యాక్సినేషన్ లో ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
✰ గ్రామాన్ని యూనిట్గా తీసుకుని టీకాలు ఇవ్వాలని.. దీనివల్ల క్రమబద్ధంగా, ప్రాధాన్యత పరంగా వ్యాక్సినేషన్ ఇచ్చినట్లవు తుందని చెప్పారు.
✰ రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితుల పై సీఎం సమీక్ష నిర్వహించారు.
✰ వ్యాక్సిన్లు వృథా కాకుండా మరింత సమర్థంగా చర్యలు చేపట్టాలని చెప్పారు.
✰ 18- 44 ఏళ్ల మధ్య వారికి కూడా వ్యాక్సిన్ ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించా లని జగన్ ఆదేశించారు.
✰ ప్రజలతో సంబంధాలున్న ఉద్యోగులు, సిబ్బందికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
✰ ఆరోగ్యశ్రీ కార్డులో కుటుంబ సభ్యుల వివరాల డేటా క్యూఆర్ కోడ్ రూపంలో అందుబాటులో ఉంచాలని సీఎం జగన్ సూచించారు.
✰ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయగానే కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలు లభ్యమయ్యేలా చూడాల న్నారు.
✰ ఆరోగ్యశ్రీ కార్డును ఆధార్తో లింక్ చేయాలని ఆదేశించారు.
✰ విలేజ్ క్లినిక్స్ నుంచి టీచింగ్ ఆస్పత్రుల వరకూ సరిపడా సిబ్బందిని నియమించాలని స్పష్టం చేశారు.
✰ నిర్ణీత సమయంలో అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలని.. నియమాకాల్లో జిల్లాను యూనిట్గా తీసుకోవా లన్నారు.
✰ మూడునెలల్లో ఈ ప్రక్రియ ను పూర్తిచేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
Thanks for reading High priority for school staff in vaccination: CM Jagan
No comments:
Post a Comment