Jio: జియో యూజర్లకు మరో సదుపాయం..!
ఇకపై రీచార్జి తేదీని గుర్తుపెట్టుకోనక్కర్లేదు
మీరు జియో యూజర్లయితే.. ఇకపై రీచార్జి తేదీని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తన కస్టమర్ల కోసం రియలన్స్ జియో మరో సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. జియో కస్టమర్లు ఇకపై యూపీఐ ద్వారా తమ టారిఫ్ ప్లాన్ రీచార్జ్ కోసం స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్తో ఆటో డెబిట్ ఫీచర్ను సెట్ చేసుకోవచ్చు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)తో కలిసి కంపెనీ ఈ ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. పోస్ట్పెయిడ్, ప్రీపెయిడ్.. రెండు రకాల కస్టమర్లూ దీన్ని ఉపయోగించుకోవచ్చు.
టెలికాం రంగంలో యూపీఐ ఆటోపే ఫీచర్ను ప్రవేశపెట్టిన తొలి కంపెనీ జియోనే. ఇకపై జియో వినియోగదారులు గడువు ముగిసిన ప్రతిసారీ ఆటోమెటిక్గా టారిఫ్ ప్లాన్ను రీచార్జ్ చేసుకునేందుకు మైజియో యాప్ ద్వారా స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ను సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఆర్బీఐ ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. రూ.5,000 వరకు రీచార్జ్కు కస్టమర్లు తమ యూపీఐ పిన్ కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు.
ఎలా యాక్టివేట్ చేసుకోవాలి..
* మైజియో యాప్కి లాగిన్ అయ్యి.. మొబైల్ సెక్షన్కి వెళ్లాలి.
* రీచార్జిలు, పేమెంట్స్ విభాగంలో జియో ఆటో పే ఆప్షన్పై క్లిక్ చేయాలి.
* గెట్ స్టార్టెడ్పై క్లిక్ చేసి కావాల్సిన ప్లాన్ను ఎంపిక చేసుకోవాలి.
* తర్వాత యూపీఐ ఆప్షన్ను ఎంచుకోవాలి.
* అనంతరం మీ యూపీఐ ఐడీని ఎంటర్ చేసి వెరిఫై చేయాలి.
Thanks for reading Jio: Another feature for jio users ..!
No comments:
Post a Comment