AP : మే 6 నుంచి వేసవి సెలవులు
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో మే 6 వ తేదీ నుంచి విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించనున్నట్లు పాఠశాల విద్యా శాఖ వెల్లడించింది . ఈ మేరకు వచ్చే నెల 4 లోగా 1-10 తరగతుల విద్యార్థులకు అవసరమైన పరీక్షల నిర్వహణను పూర్తి చేయాలని కమిషనర్ సురేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు . జులై 4 వ తేదీన పాఠశాలలను తిరిగి ప్రారంభించనున్నట్లు తెలిపారు .
పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గారి ఉత్తర్వుల సారాంశం:
★ మే 4లోగా అన్ని పరీక్షలు పూర్తి.
★ మే 5న ఇంగ్లీష్ భాష మరియు Vocabulary లో బేస్ లైన్ పరీక్ష.
★ జులై 4న తిరిగి తెరుచుకోనున్న పాఠశాలలు.
★పాఠశాలల చివరి పని దినం: *విద్యార్థులకు - మే 5, ఉపాధ్యాయులకు - మే 20
★ ఉపాధ్యాయులు క్రింది కార్యకలాపాలను చేపట్టేందుకు 2022, మే 20 వరకు అన్ని యాజమాన్య పాఠశాలలను నడపాలని నిర్ణయించారు
★(i) SA-2 పరీక్షల జవాబు పత్రాలను మూల్యాంకనం చేయడానికి.
★(ii) మార్కులను ఆన్లైన్లో అప్లోడ్ చేయడానికి..
★(iii) ప్రమోషన్ జాబితాలను సిద్ధం చేయడానికి.
★(iv) 2022-23 విద్యా సంవత్సరానికి విద్యార్థుల అడ్మిషన్లను చేపట్టడానికి...
★(v) నాడు నేడు పనులను పర్యవేక్షణ మరియు ప్రభుత్వం కేటాయించిన ఇతర పనులకు ఎప్పటికప్పుడు హాజరు కావడం.
★ ఏపి ఎడ్యుకేషనల్ రూల్స్ 1966, రూల్ 134 ప్రకారం 6 వారాల సుదీర్ఘ సెలవులు (వేసవి సెలవులు) వినియోగించుకున్న తర్వాత 2022-23 విద్యా సంవత్సరానికి అన్ని యాజమాన్యాల పాఠశాలలు 4 జూలై 2022న తిరిగి పునఃప్రారంభం అవుతాయి.
👉 పూర్తి వివరాలు మరియు ఉత్తర్వుల కాపీ ఈ క్రింది కలదు.
Thanks for reading AP: Summer vacation from May 6th
No comments:
Post a Comment