Andhra News : ఏపీలో ఈనెల 4 నుంచి ఒంటిపూట బడులు
అమరావతి : ఏపీలో పాఠశాలలకు ఈనెల 4 నుంచి ఒంటిపూట తరగతులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది . వేసవి తీవ్రత దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్య భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు . ఉదయం 7.30 గంటల నుంచి 11. 30 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు . ఒంటిపూట బడులపై ఇప్పటికే అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీచేశారు . దీనికి సంబంధించి తదుపరి చర్యలు చేపట్టాలని సూచించారు .
Thanks for reading Half day Schools from the 4th of this month in AP
No comments:
Post a Comment