Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, April 15, 2022

PM KISAN: Total Rs 4,350 crore .. All of them have to give back PM Kisan money ..


 PM KISAN : మొత్తం రూ .4,350 కోట్లు .. వారందరు పీఎం కిసాన్ డబ్బులను వెనక్కి ఇవ్వాల్సిందే ..

పేద, సన్నకారు రైతులకు సాయం చేసేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం పీఎం కిసాన్ ప్రథకాన్ని తెచ్చింది.

కానీ అర్హత లేని చాలా మందికి కూడా పీఎం కిసాన్ డబ్బులు అందాయి. ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ పన్ను కడుతున్న వారి ఖాతాల్లోకి కూడా జమయ్యాయి. ఇప్పటి వరకు రూ.4,350 కోట్లు అనర్హుల ఖాతాల్లో జమయినట్లు కేంద్రం గుర్తించింది.

వారందరి నుంచి డబ్బులను వెనక్కి తీసుకునేందుకు కేంద్రం చర్యలుచేపట్టింది. అర్హత లేకున్నప్పటికీ.. పీఎం కిసాన్ డబ్బులను పొందిన రైతు కుటుంబాల నుంచి డబ్బులను వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. ఎవరు అర్హులో, ఎవరు అనర్హులో స్పష్టతనిచ్చింది. ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా అనర్హుల నుంచి డబ్బులను వసూలు చేయాలని స్పష్టం చేసింది.

సంస్థాగత భూమి కలిగిన వారు, గతంలో లేదా ప్రస్తుతం రాజ్యాంగ పదవులను కలిగి ఉన్న రైతు కుటుంబాలు, ప్రస్తుత/మాజీ రాష్ట్ర మంత్రులు, లోక్‌సభ/రాజ్యసభ/విధానసభ/లెజిస్లేటివ్ కౌన్సిల్ మాజీ/ప్రస్తుత సభ్యులు, మున్సిపల్ కార్పొరేషన్‌ల మాజీ/ప్రస్తుత మేయర్‌లు, జిల్లా పంచాయతీల మాజీ/ ప్రస్తుత అధ్యక్షులుగా ఉన్న రైతు కుటుంబాలకు పీఎం కిసాన్ డబ్బులను పొందలేరు..

కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/కార్యాలయాలు/డిపార్ట్‌మెంట్‌లు, PSUలు, సాధారణ స్థానిక సంస్థలలో పనిచేస్తున్న లేదా పదవీ విరమణ పొందిన ఉద్యోగుల కుటుంబాలు ((మల్టీ టాస్కింగ్ స్టాఫ్/క్లాస్ IV/గ్రూప్ D ఉద్యోగు వర్గాలు మినహా) పీఎం కిసాన్‌కు అనర్హులు. 

నెలవారీ పెన్షన్ రూ.10,000 కంటే ఎక్కువ ఉన్న రిటైర్డ్ పెన్షనర్లు (మల్టీ టాస్కింగ్ స్టాఫ్/క్లాస్ IV/గ్రూప్ D ఉద్యోగు వర్గాలు మినహా), మునుపటి అసెస్‌మెంట్ సంవత్సరంలో ఆదాయపు పన్ను చెల్లించిన రైతు కుటుంబాలు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్ట్‌లుగా పనిచేస్తున్న వారికి కూడా పీఎం కిసాన్ డబ్బు రావు. 

అర్హత లేని రైతులు PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్ (https://pmkisan.gov.in/)కి వెళ్లాలి. అక్కడ ఉన్న 'రిఫండ్ ఆప్షన్'పై క్లిక్ చేయడం ద్వారా వారి ఖాతాలోని మొత్తాన్ని తిరిగి వెనక్కి ఇవ్వవచ్చు.

https://pmkisan.gov.in/SingleWindowRefund.aspx

ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM KISAN)) పథకాన్ని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద చిన్న, సన్నకారు రైతులకు ప్రతి ఏటా రూ.6వేల ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈ మొత్తాన్ని ఒకేసారి ఇవ్వకుండా విడతల వారీగా ఖాతాల్లో వేస్తున్నారు. 

ఏటా మూడు విడతల్లో రూ.2 చొప్పున మొత్తం 6వేల రూపాయలను కేంద్రం అందజేస్తోంది. డిసెంబర్ 1 నుంచి మార్చి 31 వరకు తొలి విడత, ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు రెండో విడత, ఆగస్ట్ 1 నుంచి నవంబర్ 30 వరకు మూడో విడత కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. 

మధ్యవర్తులతో ప్రమేయం లేకుండానేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లోనే డబ్బులను జమచేస్తున్నారు. ఇప్పటికే 10 విడతల డబ్బులను అందజేశారు. చివరగా జనవరి 1న పదో విడత డబ్బులను రైతుల ఖాతాల్లో వేశారు.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించిన తర్వాత ..ఇప్పటి వరకు మొత్తం 10 విడతల్లో రూ. 1.61 లక్షల కోట్లను రైతులకు ఇచ్చారు. మొత్తం 11.5 కోట్ల మంది రైతులు ఆ డబ్బులను అందుకున్నారు. 

పీఎం కిసాన్ స్కీమ్‌లో 2019 ఫిబ్రవరి 24న కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ నిరంతరాయంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేశారు. 

Thanks for reading PM KISAN: Total Rs 4,350 crore .. All of them have to give back PM Kisan money ..

No comments:

Post a Comment