Akshaya Tritiya Offers 2022 : అక్షయ తృతీయకు ‘ బంగారం'లాంటి ఆఫర్లు .. ఉచితంగా గోల్డ్ కాయిన్
సంపదలకు అధిపతి కుబేరుడు శివుణ్ని ప్రార్థించగా ఆయన అక్షయ తృతీయ (Akshaya Tritiya) రోజున లక్ష్మీ అనుగ్రహాన్ని ఇచ్చినట్టు శివపురాణం చెబుతోంది.
హిందువులు శ్రీమహాలక్ష్మీ అమ్మవారిని ఐశ్వర్యాలకు అధినేత్రిగా పూజిస్తారు. ఆమె అనుగ్రహం ఉంటే జీవితంలో ఏ లోటూ ఉండదని అంటుంటారు. అందుకనే లక్ష్మీదేవి కటాక్షం కోసం అక్షయ తృతీయ (Akshaya Tritiya) పర్వదినాన బంగారం కొనాలని పెద్దలు సూచిస్తుంటారు. బంగారం (Gold) అనేది సంపదకు చిహ్నం. సంపద ఉంటే మనం ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండగలం. ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే ఏడాది మొత్తం సంపద ఉంటుందని చాలామంది విశ్వసిస్తారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని అనేక ఆభరణాల సంస్థలు ఇప్పటికే ఆఫర్ల (Akshaya Tritiya offers)ను ప్రకటించాయి. వాటిలో కొన్ని...
జోయలుక్కాస్ (Joyalukkas) : విలువైన డైమండ్ (Diamond) లేదా అన్కట్ డైమండ్ ఆభరణాల కొనుగోలు విలువ రూ.50 వేలు దాటితే 1 గ్రాము బంగారు నాణేన్ని (Gold Coin) ఉచితంగా అందిస్తున్నారు.
తనిష్క్ (Tanishq) : బంగారం (Gold), వజ్రాభరణాల (Diamond Jewellaery) తయారీ ఛార్జీలపై ఈ సంస్థ 20 శాతం వరకు రాయితీ ఇస్తోంది. సాదా ఆభరణాలపై ఒక్కో గ్రాముకి రూ.200 తగ్గింపును ఆఫర్ చేస్తోంది. మే 4 వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.
కల్యాణ్ జ్యూవెల్లర్స్ (Kalyan Jewellers) క్యాండిరే : కొనుగోలు విలువ రూ.25 వేలు దాటితే ఉచితంగా బంగారు నాణేన్ని ఇస్తున్నారు. Solitaire'పై ఫ్లాట్ 40 శాతం తగ్గింపును, బంగారు ఆభరణాల (Gold Jewellery) తయారీ ఛార్జీలపై 60 శాతం వరకు తగ్గింపునిస్తున్నారు. వజ్రాభరణాలపై జీరో మేకింగ్ ఛార్జీలు, ప్లాటినం ఆభరణాల తయారీ ఛార్జీలపై 40 శాతం వరకు తగ్గింపును ఆఫర్ చేస్తున్నారు. ప్రముఖ బ్యాంకులకు చెందిన డెబిట్, క్రెడిట్ కార్డుల (Credit Card) ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా మరో 5 శాతం తక్షణ రాయితీ కూడా లభిస్తుంది.
మలబార్ గోల్డ్ (Malabar Gold) : రూ.25,000 విలువైన బంగారు ఆభరణాలను ఆన్లైన్లో కొనుగోలు చేసే వారికి ఉచితంగా బంగారు నాణేన్ని అందిస్తున్నారు. ఒకవేళ రూ.25,000 విలువైన డైమండ్, ఇతర విలువైన ఆభరణాలను కొంటే రెండు బంగారు నాణేలను సంస్థ అందజేస్తోంది. క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసే వారికి అదనంగా మరో 5 శాతం క్యాష్బ్యాక్ కూడా ఉంటుంది.
క్యారట్లేన్ (Caratlane) : అన్ని డిజైన్ల వజ్రాభరణాలపై ఫ్లాట్ 20 శాతం తగ్గింపును క్యారట్లేన్ అందిస్తోంది. ఏప్రిల్ 22 నుంచి మే 3 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
పీసీ జ్యూవెల్లర్స్ (PC Jewellers) : వెండి నగలపై ఫ్లాట్ 40 శాతం రాయితీ, వజ్రాభరణాలపై ఫ్లాట్ 30 శాతం తగ్గింపు లభించనుంది.
త్రిభువన్దాస్ భీమ్జీ జావేరి (Tribhovandas Bhimji Zaveri) : అక్షయ తృతీయ (Akshaya Tritiya) సందర్భంగా వజ్రాభరణాల తయారీ ఛార్జీలపై 50 శాతం వరకు తగ్గింపును ఇస్తోంది. ఎక్స్ఛేంజీలకిచ్చే బంగారంపై 100 శాతం విలువను అందిస్తోంది.
సెంకో గోల్డ్ (Senco Gold) : బంగారు ఆభరణాల్లో ప్రతి గ్రాముపై రూ.224 తగ్గింపు అందిస్తున్నారు. తయారీ ఛార్జీలపై 50 శాతం రాయితీ లభించనుంది. వెండి నాణేలు, వజ్రాభరణాల (Diamond Jewellaery) తయారీ ఛార్జీలపై 100 శాతం తగ్గింపును అందజేస్తున్నారు.
Thanks for reading Akshaya Tritiya Offers 2022
No comments:
Post a Comment