Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, June 16, 2022

Andhra News: Good news for village and ward secretariat employees in AP


 Andhra News : ఏపీలో గ్రామ , వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త

అమరావతి: కొత్త పీఆర్సీ కోసం వేచి చూస్తున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఉద్యోగులకు ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేసే దస్త్రంపై సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి గురువారం సంతకం చేశారు.

రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకుని, డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలో ఉత్తీర్ణులైన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేయనున్నారు. ఈ అధికారాన్ని ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు శుక్రవారం వెలువడే అవకాశముంది. సచివాలయ ఉద్యోగులకు పాత స్కేల్‌ ప్రకారమే జీతాలు ఇవ్వాలని ఆర్థిక శాఖ నిర్ణయించినప్పటికీ .. జులై నెల వేతనాలు కొత్త పీఆర్సీ ప్రకారమే ఇవ్వాలని సీఎం ఆదేశించినట్టు సమాచారం. ప్రొబేషన్‌ పూర్తి చేసుకున్న ఉద్యోగులకు మాత్రమే కొత్త వేతనాలు అందనున్నాయని తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 40వేల మందికి పైగా సచివాలయ ఉద్యోగులు ఏపీపీఎస్సీ నిర్వహించిన డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలో ఉత్తీర్ణులైనట్టు సమాచారం.


మరోసారి డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలు: వెంకట్రామిరెడ్డి

రాష్ట్రంలో మొత్తం 1.17లక్షల మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారని, వారిలో డిపార్ట్‌మెంటల్‌ పరీక్ష పాసైన వారికే ప్రొబేషన్‌ ఇవ్వాలని నిర్ణయించినట్టు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. ప్రొబేషన్‌కు లక్ష మందికిపై ఉద్యోగులు అర్హత సాధిస్తారని పేర్కొన్నారు. 16వేల మంది మాత్రమే పరీక్ష పాస్‌ కాలేదని వెల్లడించారు. అలాంటి వారికి ఈనెలలోనే ఏపీపీఎస్సీ ద్వారా పరీక్ష నిర్వహిస్తారని చెప్పారు. డిపార్ట్‌మెంటల్‌ పరీక్షల ఫలితాలు త్వరగా ఇవ్వాలని, పరీక్షలో పాసైన వారికి ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేయాలని సీఎం ఆదేశించారని వెంకట్రామిరెడ్డి తెలిపారు.

Thanks for reading Andhra News: Good news for village and ward secretariat employees in AP

No comments:

Post a Comment