ఆగస్టు 1 నుంచి టీచర్లకు ఆన్లైన్ హాజరు
రెండేళ్లుగా కొవిడ్ నేపథ్యంలో దూరమైన ఆన్లైన్ హాజరు విధానాన్ని పాఠశాల విద్యాశాఖ పునరుద్ధరిస్తోంది. ఆగస్టు 1 నుంచి ఉపాధ్యాయులంతా వారి సొంత ఫోన్లలోనే ఫేషియల్ రికగ్నైజేషన్ విధానంలో హాజరును నమోదుచేయాలని సూచించింది. ఇందుకోసం ప్రత్యేక యాప్ రూపొందించినట్లు తెలిపింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అధికారులు మంగళవారం ఉపాధ్యాయులతో నిర్వహించిన వెబ్ఎక్స్ సమావేశంలో స్పష్టంచేశారు. అలాగే చైల్డ్ ఇన్ఫో నమోదు ప్రక్రియను పూర్తిచేయాలన్నారు. ఉదయం 10.30గంటలలోపు ఏ ఒక్క విద్యార్థికి హాజరు వేయకపోయినా హెచ్ఎంతోపాటు, ఎంఈవో, డీఈవోలకు షోకాజ్ నోటీసులు వస్తాయని స్పష్టంచేశారు.
► ɴᴇᴡ ɪɴᴛᴇɢʀᴀᴛᴇᴅ ᴀᴘᴘ (sᴛᴜᴅᴇɴᴛ ᴀᴛᴛᴇɴᴅᴀɴᴄᴇ/ᴛᴇᴀᴄʜᴇʀ ᴀᴛᴛᴇɴᴅᴀɴᴄᴇ/ᴍɪᴅ ᴅᴀʏ ᴍᴇᴀʟ/ᴛᴏɪʟᴇᴛ/ ᴛᴇᴀᴄʜᴇʀ ʟᴇᴀᴠᴇs )ɪs ɢᴏɪɴɢ ᴛᴏ ɪɴᴛʀᴏᴅᴜᴄᴇᴅ ʙʏ ᴄsᴇ sʜᴏʀᴛʟʏ.
Thanks for reading Online attendance for teachers from August 1
No comments:
Post a Comment