సైబర్ క్రైమ్ లో పోగొట్టుకున్న డబ్బులు ఇలా పొందొచ్చు
నేటి ప్రపంచంలో ఇంటర్నెట్ రోజువారీ అవసరం. ఎంతోమంది స్మార్ట్ ఫోన్ వాడుతూ తమ అవసరాలకు అనుగుణంగా వాడుతున్నారు. ఇక్కడే పెద్ద చిక్కొచ్చి పడింది.
బ్యాంకు అధికారులమంటూ, కస్టమర్ కేర్ నుంచి కాల్ చేస్తున్నామని, లేదంటే భారీ ప్రైజ్ మనీ గెలుచుకున్నారని.. నమ్మించి.. ప్రజల ఆన్లైన్ బ్యాంకింగ్, ఈ-వ్యాలెట్ల వివరాలు చెప్పించుకుని రూ.లక్షలు కాజేస్తున్నారు సైబర్ నేరస్థులు. తమ అకౌంట్లో ఉన్న డబ్బులు మాయం కావడంతో ఏ జరిగిందో తెలియక స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు బాధితులు. అయితే సైబర్ నేరగాళ్ల దూకుడుకు కళ్లెం వేసేందుకు సైబర్క్రైమ్ పోలీస్ అధికారులు కొత్త పంథా అనుసరిస్తున్నారు.
బాధితులు నిందితులకు బదిలీ చేసిన నగదు వివరాలను 24గంటల్లోపు టోల్ఫ్రీ నంబర్ 1930కు ఫోన్ చేసి చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత https://cybercime.gov.in పోర్టల్లో వివరాలను నమోదు చేయాలి. దానికి బ్యాంక్ అకౌంట్ ట్రాన్సక్షన్ వివరాలను యాడ్ చేయాలి. వెంటనే నిమిషాల వ్యవధిలో మీ ఫిర్యాదు నమోదు చేశాము ఫలానా స్టేషన్ కు వెళ్తే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారంటూ ఈ-మెయిల్, ఫోన్ కి మెసేజ్ వస్తుంది. బాధితుడి వివరాలను సైబర్ క్రైమ్ పోర్టల్ అధికారులు ఆయా రాష్ట్రాల పోలీసులకు, బ్యాంకులకు సమాచారం ఇస్తారు. పోలీస్ అధికారులు బాధితుల ఫిర్యాదును ధ్రువీకరించిన వెంటనే బ్యాంకుల నోడల్ అధికారులు సైబర్ నేరస్థులు వినియోగించిన ఖాతా ఏ బ్యాంక్లో ఉంటే ఆ ఖాతాలో సొమ్మును స్తంభింపజేసి బాధితుల ఖాతాలోకి తిరిగి జమ చేయిస్తారు.
దేశవ్యాప్తంగా నిర్విరామంగా నెట్వర్క్ పనిచేస్తోంది. దీంతోపాటు ఇక్కడ పట్టుపడిన నేరస్థుల వివరాలను ఇతర రాష్ట్రాలకు పంపించి అక్కడా నేరాలకు పాల్పడి ఉంటే హైదరాబాద్ నుంచి పీటీ వారెంట్ ద్వారా తీసుకెళ్లేందుకు సహకరిస్తున్నారు. దీంతో ఎక్కువకాలం వారు జైళ్లలో ఉండేలా చేస్తున్నారు. బీహార్, ఝార్ఖండ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వందల సంఖ్యలో సైబర్ ముఠాలున్నాయి. వీరిని జైళ్లకు పంపడం ద్వారా అక్కడున్న ఇతర నేరస్థులకు భయం కలగడంతోపాటు తాత్కాలికంగా నేరాలు కాస్త తగ్గుతాయని భావిస్తున్నారు.
Thanks for reading This is how money lost in cybercrime can be recovered.
No comments:
Post a Comment