Andhra News: ప్రభుత్వ ఉద్యోగులకు విద్యుత్ వాహనాలు
ప్రభుత్వ ఉద్యోగులకు విద్యుత్ ద్విచక్ర వాహనాలను అందించే పథకాన్ని పునరుత్పాదక ఇంధన వనరులశాఖ (నెడ్క్యాప్) ప్రారంభించింది. దీని కోసం 17 వాహన తయారీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఓలా, ఆథర్, బిగాస్, కైనెటిక్, టీవీఎస్, హీరో వంటివి ఈ జాబితాలో ఉన్నాయి.
ఏడాదిలో లక్ష అందించాలని లక్ష్యం 17 కంపెనీలతో ఒప్పందం
ఈనాడు, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు విద్యుత్ ద్విచక్ర వాహనాలను అందించే పథకాన్ని పునరుత్పాదక ఇంధన వనరులశాఖ (నెడ్క్యాప్) ప్రారంభించింది. దీని కోసం 17 వాహన తయారీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఓలా, ఆథర్, బిగాస్, కైనెటిక్, టీవీఎస్, హీరో వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆప్కాబ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కంపెనీ (ఐడీఎఫ్సీ) ఆర్థిక సహకారం అందిస్తాయి. ఏడాదిలో కనీసం లక్ష వాహనాలను అందించాలన్నదే లక్ష్యమని ఒక అధికారి తెలిపారు. విద్యుత్ వాహనాల కోసం 26 జిల్లాల్లో పని చేసే ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవడానికి ప్రత్యేకంగా యాప్ను నెడ్క్యాప్ అందుబాటులోకి తెచ్చింది. వాహనాలకు రుణాలను అందించడానికే బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రత్యేకశాఖను విజయవాడలో ఏర్పాటు చేస్తుంది.
Thanks for reading Andhra News: Electric vehicles for government employees
No comments:
Post a Comment