APPSC: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా
అమరావతి: గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) వాయిదా వేసింది. డిసెంబరు 18న జరిగే ప్రిలిమ్స్ పరీక్షను కొన్ని పాలనా సంబంధమైన కారణాల దృష్ట్యా వాయిదా వేస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రిలిమినరీ పరీక్షను వచ్చే ఏడాది జనవరి 08న నిర్వహించనున్నట్లు వెల్లడించింది. 92 గ్రూప్-1 పోస్టులకు సెప్టెంబర్ 30న ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
Thanks for reading APPSC: Postponement of Group-1 Prelims Exam
No comments:
Post a Comment